ఆ వ్యక్తికి ఏ కష్టమొచ్చిందో ఏమో.. ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అతనికి ఎదురైన సమస్యల నుంచి తాను మాత్రమే ఆత్మహత్య చేసుకోకుండా తన కుటుంబ సభ్యులు కూడా ఆ కష్టాలను పడకూడదని ఆలోచించాడేమో కానీ ఎంతో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలోని మోదుగులపాలెం గ్రామంలో నివసిస్తున్న మురళి అనే వ్యక్తి తన కూతురికి, తన తల్లికి విషం ఇచ్చి ఆపై తాను విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కేవలం కుటుంబ కలహాలు, ఆర్థిక పరమైన సమస్యల కారణంగా మురళి అనే వ్యక్తి తన తల్లి మస్తానమ్మ, తన కూతురు కావ్య శ్రీ (11) కి విషం ఇచ్చి ఆపై తాను విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునేలోపు అందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మురళి, తన కూతురు కావ్య కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా వారిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మస్తానమ్మ వయసు పైబడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మురళి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ప్రస్తుతం కావ్య పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ విధంగా కుటుంబ కలహాల కారణంగా కుటుంబ సభ్యులు మొత్తం విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…