కేవలం ఫోన్ లో ఎక్కువగా మాట్లాడొద్దని తన తల్లి కూతురిని హెచ్చరించేందుకుగాను ఆ కూతురు తల్లికి కడుపుకోతను మిగిల్చింది. కేవలం తన తల్లిదండ్రులు తనని మందలించారన్న కోపంతోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్ కేసర్ సమీపంలో చోటు చేసుకుంది. ఘట్ కేసర్ సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల మేరకు..
మహబూబ్నగర్ జిల్లా ఉంద్యాల్ గ్రామానికి చెందిన జమ్మికుంట విష్ణు, పద్మ దంపతుల ఒక కుమార్తె కుమారుడు కలరు. వీరు అన్నోజీగూడ రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నారు. విష్ణు హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నారు. తన కూతురు స్రవంతి పదవ తరగతి పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం కాలేజీలు లేకపోవడంతో ఇంటిపట్టునే ఉన్న స్రవంతి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతూ గడిపేది.ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు తనని ఫోన్లో మాట్లాడడం తగ్గించమని చెప్పారు. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోక పోవడంతో శుక్రవారం రాత్రి తన తల్లిదండ్రులు గట్టిగా మందలించారు.
ఈ విధంగా తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్రవంతి శుక్రవారం రాత్రి పడుకున్న సమయంలో కిరోసిన్ డబ్బా చేతపట్టుకొని తల్లిదండ్రులు బయటకు రాకుండా తలుపు బయట గడియ పెట్టి సమీప కాళీ ప్రదేశంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మరుసటి రోజు ఉదయం వాకింగ్ వెళ్లిన స్థానికులు సగం కాలిన మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలానికి డాగ్, క్లూస్ టీంలు చేరుకొని ఆధారాలు సేకరించారు. పోలీసులు ఘటన స్థలం వద్ద సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…