సాధారణంగా అమ్మాయిలకు పెళ్లి వయసు రాగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. అక్కడ తన కూతురు జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి భావిస్తారు.దురదృష్టవశాత్తు అత్తారింట్లో కూతురి జీవితం బాగాలేకపోతే తల్లిదండ్రులు తమ కూతురిని ఆదరించి తనకు చేదోడువాదోడుగా నిలబడతారు. కానీ మధ్యప్రదేశ్ కు చెందిన తల్లిదండ్రులు తన కూతురు పట్ల కనికరం కూడా లేకుండా ఆమె పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించారు.కేవలం అత్తారింటి నుంచి పారిపోయి వచ్చిందనే కారణంతో ఏమాత్రం మానవత్వం లేకుండా ఆమెను గొడ్డును బాదినట్టు బాదిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అలీరాజ్పూర్ జిల్లా భోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని భడీ ఫౌల్ తల్వా అనే గిరిజన గ్రామంలో జూన్ 28న ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత యువతికి మూడు నెలల కిందట వివాహం జరిగింది. పెళ్లయిన మూడు నెలలకే అత్తారింటి నుంచి పుట్టింటికి పారిపోయి రావడంతో ఆమె తల్లిదండ్రులు సోదరులు బంధువులు ఆమె పట్ల ఎంతో రాక్షసంగా ప్రవర్తించారు.అసలు అత్తారింట్లో తనకే సమస్య ఉందని కూడా అడగకుండా అత్తారింటికి నుంచి పారిపోయి వచ్చినందుకు ఆమె పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించి ఆమెను చితకబాదారు.
ఆమె తల్లిదండ్రులు యువతి జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లి ఒక చెట్టుకు కట్టి కర్ర విరిగే వరకు గొడ్డును బాదినట్లు బాదారు. వారి కొడుతుంటే ఆమె ఆర్తనాదాలు చేస్తోంది. అయితే ఈ సంఘటనను చూడటానికి చుట్టూ ఎంతో మంది ఉన్నారు కానీ ఎవరో కూడా ఈ దారుణాన్ని ఆపటానికి ప్రయత్నించలేదు. పైగా ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన పోలీసులు బాధిత యువతి నుంచి ఫిర్యాదు తీసుకుని తన తల్లిదండ్రుల పై కేసు నమోదు చేసుకున్నారు.అదే విధంగా తన అత్తారింటి నుంచి పారిపోయి రావడానికి గల కారణాలను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…