సాధారణంగా అమ్మాయిలకు పెళ్లి వయసు రాగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. అక్కడ తన కూతురు జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి భావిస్తారు.దురదృష్టవశాత్తు అత్తారింట్లో కూతురి జీవితం బాగాలేకపోతే తల్లిదండ్రులు తమ కూతురిని ఆదరించి తనకు చేదోడువాదోడుగా నిలబడతారు. కానీ మధ్యప్రదేశ్ కు చెందిన తల్లిదండ్రులు తన కూతురు పట్ల కనికరం కూడా లేకుండా ఆమె పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించారు.కేవలం అత్తారింటి నుంచి పారిపోయి వచ్చిందనే కారణంతో ఏమాత్రం మానవత్వం లేకుండా ఆమెను గొడ్డును బాదినట్టు బాదిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అలీరాజ్పూర్ జిల్లా భోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని భడీ ఫౌల్ తల్వా అనే గిరిజన గ్రామంలో జూన్ 28న ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత యువతికి మూడు నెలల కిందట వివాహం జరిగింది. పెళ్లయిన మూడు నెలలకే అత్తారింటి నుంచి పుట్టింటికి పారిపోయి రావడంతో ఆమె తల్లిదండ్రులు సోదరులు బంధువులు ఆమె పట్ల ఎంతో రాక్షసంగా ప్రవర్తించారు.అసలు అత్తారింట్లో తనకే సమస్య ఉందని కూడా అడగకుండా అత్తారింటికి నుంచి పారిపోయి వచ్చినందుకు ఆమె పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించి ఆమెను చితకబాదారు.
ఆమె తల్లిదండ్రులు యువతి జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లి ఒక చెట్టుకు కట్టి కర్ర విరిగే వరకు గొడ్డును బాదినట్లు బాదారు. వారి కొడుతుంటే ఆమె ఆర్తనాదాలు చేస్తోంది. అయితే ఈ సంఘటనను చూడటానికి చుట్టూ ఎంతో మంది ఉన్నారు కానీ ఎవరో కూడా ఈ దారుణాన్ని ఆపటానికి ప్రయత్నించలేదు. పైగా ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన పోలీసులు బాధిత యువతి నుంచి ఫిర్యాదు తీసుకుని తన తల్లిదండ్రుల పై కేసు నమోదు చేసుకున్నారు.అదే విధంగా తన అత్తారింటి నుంచి పారిపోయి రావడానికి గల కారణాలను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…