PUBG గేమ్ బారిన పడి ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు గేమ్ కారణంగా మానసిక ఒత్తిడికి గురై, తల్లిదండ్రుల నుంచి చీవాట్లు ఎదుర్కొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు తల్లిదండ్రులకు చెందిన బ్యాంక్ అకౌంట్ల నుంచి వారికి తెలియకుండా పెద్ద మొత్తంలో డబ్బును ఆ గేమ్లో ఖర్చు పెట్టి ఆ విధంగా బలవుతున్నారు. ప్రస్తుత తరుణంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముంబైలోనూ ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని పశ్చిమ పట్టణ ప్రాంతంలో ఉన్న జోగేశ్వరి అనే ఏరియాకు చెందిన 16 ఏళ్ల బాలుడు PUBG గేమ్కు బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే అతను తన తల్లి బ్యాంక్ ఖాతా నుంచి రూ.10 లక్షలను విత్డ్రా చేసి గేమ్లో ఖర్చు పెట్టాడు. గేమ్లో ఐడీ, వర్చువల్ కరెన్సీ, ఇతర ఐటమ్స్ కొనేందుకు అతను ఆ మొత్తాన్ని ఖర్చు చేశాడు.
అయితే ఆ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ బాలుడు ఓ లెటర్ రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని ఆ బాలుడి కోసం గాలించారు.
చివరకు ఆ బాలుడు అంధేరీ ఈస్ట్ లోని మహాకాళి కేవ్స్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకుని అతన్ని ఆధీనంలోకి తీసుకుని అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారుడు గత నెల రోజులుగా PUBG గేమ్కు బానిస అయ్యాడని, ఎప్పుడూ గేమ్లో మునిగి తేలేవాడని, అందువల్లే ఇలా చేశాడని తల్లిదండ్రులు తెలిపారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…