PUBG గేమ్ బారిన పడి ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు గేమ్ కారణంగా మానసిక ఒత్తిడికి గురై, తల్లిదండ్రుల నుంచి చీవాట్లు ఎదుర్కొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు తల్లిదండ్రులకు చెందిన బ్యాంక్ అకౌంట్ల నుంచి వారికి తెలియకుండా పెద్ద మొత్తంలో డబ్బును ఆ గేమ్లో ఖర్చు పెట్టి ఆ విధంగా బలవుతున్నారు. ప్రస్తుత తరుణంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముంబైలోనూ ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని పశ్చిమ పట్టణ ప్రాంతంలో ఉన్న జోగేశ్వరి అనే ఏరియాకు చెందిన 16 ఏళ్ల బాలుడు PUBG గేమ్కు బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే అతను తన తల్లి బ్యాంక్ ఖాతా నుంచి రూ.10 లక్షలను విత్డ్రా చేసి గేమ్లో ఖర్చు పెట్టాడు. గేమ్లో ఐడీ, వర్చువల్ కరెన్సీ, ఇతర ఐటమ్స్ కొనేందుకు అతను ఆ మొత్తాన్ని ఖర్చు చేశాడు.
అయితే ఆ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ బాలుడు ఓ లెటర్ రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని ఆ బాలుడి కోసం గాలించారు.
చివరకు ఆ బాలుడు అంధేరీ ఈస్ట్ లోని మహాకాళి కేవ్స్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకుని అతన్ని ఆధీనంలోకి తీసుకుని అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారుడు గత నెల రోజులుగా PUBG గేమ్కు బానిస అయ్యాడని, ఎప్పుడూ గేమ్లో మునిగి తేలేవాడని, అందువల్లే ఇలా చేశాడని తల్లిదండ్రులు తెలిపారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…