ప్రస్తుతం ప్రపంచం ఎంతో ముందుకు పోతుంది.రోజురోజుకు టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతూ దూసుకుపోతున్న ఈ ప్రపంచంలో ఇప్పటికీ అక్కడక్కడ గుడ్డిగా మూఢనమ్మకాలను నమ్ముతూ ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న వారు కూడా ఉన్నారు. ఈ విధంగా మూఢనమ్మకాలను నమ్ముతూ క్షుద్రపూజలు ప్రాణాలను బలివ్వడం వంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా 10 సంవత్సరాల బాలికను బలిచ్చిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
బీహార్లోని ముంగేర్ జిల్లాకు చెందిన దిలీప్కు కుమార్కు ఐదేళ్ల క్రితం వివాహం అయితే ఐదు సంవత్సరాలలో తన భార్య పలుమార్లు గర్భందాల్చిన అబార్షన్ జరుగుతుంది. ఈ క్రమంలోనే అతను ఎన్నో ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకున్న ఎలాంటి ఫలితం లేకపోవడంతో కొందరి స్నేహితుల సలహా మేరకు పర్వేజ్ ఆలమ్ అనే తాంత్రికుడుని కలిశాడు. ఈ క్రమంలోనే పది సంవత్సరాల బాలికను బలి ఇస్తే తన సమస్యకు పరిష్కారం ఉందని చెప్పారు.
తాంత్రికుడు చెప్పిన విధంగానే దిలీప్ 10 సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసి ఆమెను చంపి ఆమె కళ్ళతో రక్తంతో క్షుద్రపూజలు చేశారు. పొలంలో ఉన్న తండ్రికి భోజనం తీసుకు వెళుతున్న చిన్నారి తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే మరుసటి రోజు ఆ గ్రామ శివారులో బాలిక మృతదేహం కనపడటంతో పోలీసులు అసలు విషయం తెలుసుకొని దిలీప్ ను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా దిలీప్ జరిగిన విషయం తెలియజేశారు.ఈ క్రమంలోనే చిన్నారి కుటుంబ సభ్యులు అతనికి కఠినమైన శిక్ష విధించాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…