ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదలకుండా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలోనే వకీల్ సాబ్ హీరోయిన్ నివేద థామస్ కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా తెలియజేసింది. వకీల్ సాబ్ ప్రమోషన్ లో పాల్గొన్న నేపథ్యంలోనే ఈమెకు కరోనా నిర్ధారణ అయినట్లు తెలియజేశారు.
నివేద థామస్ కరోనా నిర్ధారణ జరిగి నాలుగు రోజులు కాకుండానే ,మరొక హీరోయిన్ కూడా కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ అంజలికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఈమె హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. వకీల్ సాబ్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న ఈ ఇద్దరు హీరోయిన్స్ కరోనా బారిన పడటంతో చిత్ర బృందం కొంతమేరకు ఆందోళన చెందుతోంది.
ప్రస్తుతం హీరోయిన్ అంజలి పరిస్థితి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గత కొద్ది రోజుల నుంచి తనని కలిసిన వారందరూ తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అంజలి కోరింది. వకీల్ సాబ్ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటించారు. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…