ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదలకుండా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలోనే వకీల్ సాబ్ హీరోయిన్ నివేద థామస్ కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా తెలియజేసింది. వకీల్ సాబ్ ప్రమోషన్ లో పాల్గొన్న నేపథ్యంలోనే ఈమెకు కరోనా నిర్ధారణ అయినట్లు తెలియజేశారు.
నివేద థామస్ కరోనా నిర్ధారణ జరిగి నాలుగు రోజులు కాకుండానే ,మరొక హీరోయిన్ కూడా కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ అంజలికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఈమె హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. వకీల్ సాబ్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న ఈ ఇద్దరు హీరోయిన్స్ కరోనా బారిన పడటంతో చిత్ర బృందం కొంతమేరకు ఆందోళన చెందుతోంది.
ప్రస్తుతం హీరోయిన్ అంజలి పరిస్థితి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గత కొద్ది రోజుల నుంచి తనని కలిసిన వారందరూ తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అంజలి కోరింది. వకీల్ సాబ్ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటించారు. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…