సినిమా రంగంలోకి ఇప్పటి వరకు ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే వారసులు పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అదేవిధంగా కొందరు వారసురాళ్లు కూడా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ వారు కేవలం రెండు మూడు సినిమాలలో నటించినప్పటికీ పెద్ద గుర్తింపును సంపాదించుకోలేక పోయారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి వచ్చిన మెగా డాటర్ నిహారిక రెండు మూడు సినిమాలకు పరిమితమై సినిమాలలో మంచి గుర్తింపును సంపాదించుకోలేకపోయింది.
ఇకపోతే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక ఆర్టిస్ట్ గా ఉండిపోయింది. జీవిత రాజశేఖర్ కూతుళ్ళ విషయానికి వస్తే వీరు కూడా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరొక వారసురాలిని కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీకాంత్, ఊహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే “నిర్మలా కాన్వెంట్” ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో “పెళ్లి సందడి” సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా శ్రీకాంత్ కూతురు మేధ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలోకి రావాలనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికీ రుద్రమదేవి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించిన ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేయటం కోసం ఏకంగా శ్రీకాంత్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరి ఈ వారసురాలు ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…