మెగా హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి తేజ్ ప్రమాదానికి గురవడంతో వెంటనే పోలీసులు అతనిని దగ్గరలో ఉన్న మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో మెగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకొని సాయి తేజ్ ను మెరుగైన చికిత్స కోసం అపోలోకు తరలించారు. సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యారన్న విషయం తెలుసుకొని మెగా కుటుంబ సభ్యులు అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్, నాగబాబు, సురేఖ, నిహారిక, వరుణ్ ఆస్పత్రికి చేరుకొని సాయి తేజ్ ను పరామర్శించారు.
ఈ క్రమంలోనే అపోలోలో చికిత్స పొందుతున్న సాయితేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు.. అంటూ మెగా కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. మెగా హీరో సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యారన్న వార్త తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు తను త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా మెగా హీరో రామ్ చరణ్ తేజ్ తన భార్య ఉపాసన అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అలాగే సాయి తేజ్ ప్రమాదంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ప్రమాదం నుంచి తొందరగా కోలుకోవాలి సోదరా అంటూ ట్వీట్ చేశారు. అయితే తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, రెండు రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటే ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…