మెగా హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి తేజ్ ప్రమాదానికి గురవడంతో వెంటనే పోలీసులు అతనిని దగ్గరలో ఉన్న మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో మెగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకొని సాయి తేజ్ ను మెరుగైన చికిత్స కోసం అపోలోకు తరలించారు. సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యారన్న విషయం తెలుసుకొని మెగా కుటుంబ సభ్యులు అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్, నాగబాబు, సురేఖ, నిహారిక, వరుణ్ ఆస్పత్రికి చేరుకొని సాయి తేజ్ ను పరామర్శించారు.
ఈ క్రమంలోనే అపోలోలో చికిత్స పొందుతున్న సాయితేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు.. అంటూ మెగా కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. మెగా హీరో సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యారన్న వార్త తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు తను త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా మెగా హీరో రామ్ చరణ్ తేజ్ తన భార్య ఉపాసన అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అలాగే సాయి తేజ్ ప్రమాదంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ప్రమాదం నుంచి తొందరగా కోలుకోవాలి సోదరా అంటూ ట్వీట్ చేశారు. అయితే తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, రెండు రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటే ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…