సమాజంలో జరుగుతున్న దోపిడీలు, అరాచకాల నుంచి ప్రజలను కాపాడాల్సిన పోలీసులే వారి బాధ్యతలు మరిచి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన ప్రజలను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోలీసులు చేస్తున్నటువంటి ఇలాంటి పాడు పనులకు ప్రజలలో పోలీసులపై ఉన్న విశ్వాసం తగ్గిపోతోంది. సమాజం పట్ల బాధ్యత వహించాల్సిన పోలీసులు వాళ్ల బాధ్యత మరిచి దొంగతనానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని విజయ డైరీ సమీపంలో తమిళనాడుకు చెందిన వ్యక్తి పీవీకేఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో వ్యానులో దుస్తుల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఓ రోజు రాత్రి బట్టలను మూట కట్టి పోలీసులు ఉన్నారన్న ధైర్యంతో అక్కడి నుంచి వ్యాపారి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి ఆ మూటలను గమనించిన వ్యాపారి మూటలో బట్టలు తక్కువగా ఉండటాన్ని గమనించాడు. ఈ క్రమంలోనే తన షాపులో దొంగతనం జరిగిందని భావించిన వ్యక్తి అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ చూశాడు.
ఈ వీడియో చూసిన షాపు యజమాని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. తన షాపులో దొంగతనం చేసినది సాదాసీదా వ్యక్తులు కాదు పోలీసులేనన్న విషయం తెలియడంతో ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై రాగా ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్ లో ఉండి మరొక వ్యక్తి సివిల్ డ్రెస్ ధరించి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు. తన షాప్ లో దొంగతనం చేసింది పోలీసులేనని గుర్తించిన యజమాని ఈ విషయాన్ని జిల్లా పోలీస్ శాఖ అధికారులకు తెలియజేయడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం తెలిసిన ప్రజలు పోలీసులు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…