టీవీ చానళ్లలో మనకు రోజూ కనిపించే ప్రముఖ యాంకర్ సుమ గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె టీవీ షోలు, ఈవెంట్లు చేస్తూ యమా బిజీగా ఉంటుంది. ఇక యూట్యూబ్ చానల్ను కూడా ప్రారంభించడంతో ఆమె మరింత బిజీ అయిపోయింది. అలాగే ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా ఎప్పటికప్పుడు సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. నటుడిగా రాజీవ్ చక్కని పేరు తెచ్చుకున్నారు.
అయితే సుమ, రాజీవ్ కనకాల మధ్య గొడవలు వచ్చాయని, వారు విడాకులు తీసుకోబోతున్నారని, విడిగా ఉంటున్నారని.. అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూరేలా వారు హైదరాబాద్లో వేర్వేరు ఇళ్లలో ఉండడం మొదలు పెట్టారు. అయితే తమ వైవాహిక బంధంపై రాజీవ్ కనకాల నోరు విప్పారు.
ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల తన వివాహ బంధంపై క్లారిటీ ఇచ్చారు. సుమతో కొన్ని రోజులు నిజంగానే విడిగా ఉన్నానని చెప్పారు. అయితే అది వివాహ బంధంలోని గొడవ వల్ల కాదని, అసలు తమ మధ్య గొడవలు లేవని, ఆమెతో కలిసి కాకుండా విడిగా ఉండేందుకు కారణం ఉందని చెప్పారు.
తన తల్లి చనిపోయాక తండ్రి దేవదాస్ కనకాల మణికొండలో ఒక్కరే ఉండేవారని, ఆయనను తన ఇంటికి తీసుకువద్దామంటే ఆయన లైబ్రరీ చాలా పెద్దగా ఉందని, ఆ పుస్తకాలన్నింటినీ తన ఇంటిక తేవడం కష్టమని భావించి.. తానే తన తండ్రి ఇంటికి వెళ్లి కొన్ని రోజులు గడిపానని, అందుకనే సుమ, తాను విడి విడిగా ఉండాల్సి వచ్చిందని.. అంతే తప్ప తమ వైవాహిక బంధంపై వచ్చిన వార్తలన్నీ అబద్దమని చెప్పారు. తాము కలిసే ఉన్నామన్నారు.
కాగా రాజీవ్ ఇటీవలే వెంకటేష్తో కలిసి నారప్ప సినిమాలో నటించారు. అందులో ఆయన కీలకపాత్ర పోషించారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…