సినిమా

ఆ దర్శకుడితో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య బాబు ?

డేటింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ సినిమాలు ఏ తరహాలో ఉంటాయో మనకు తెలిసిందే. పూరి సినిమాలలో హీరోలకు ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్, హీరోయిన్ కి డిఫరెంట్ రోల్ ఇచ్చి విభిన్న కథాంశంతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకుడిగా నిర్మాతగా మారిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా చిత్రంగా “లైగర్” అనే సినిమాకు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను చేపడుతున్నారు.

ఇకపోతే “లైగర్” తర్వాత పూరి తన తర్వాత ప్రాజెక్టుగా నందమూరి నటసింహం బాలకృష్ణతో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలకృష్ణకు కథ చెప్పడంతో కథ వినగానే బాగా నచ్చడంతో ఈ సినిమాలో చేయడానికి బాలయ్య బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇడియట్ తరహాలో ఉండబోతోందని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఈ కథలో కొడుకు గెలుపు కోసం తండ్రి ఏం చేశాడు అనే లైన్ ఆధారంగా సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం పూరి “లైగర్ ” సినిమాతో బిజీగా ఉండగా.. బాలయ్య బాబు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అఖండ” సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా బాలయ్య బాబు త్విపాత్రాభినయం చేయనున్నారు. అయితే గతంలో పూరి, బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన “పైసా వసూల్”చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, ప్రేక్షకులలో మాత్రం మంచి క్రేజ్ సంపాదించింది.తరువాత వీరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ ఈ ఏడాది వేసవిలో ప్రారంభం కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

దసరా బరిలో ప్రభాస్ ‘ఫౌజీ’? రిలీజ్ డేట్‌పై నెట్టింట క్రేజీ ప్రచారం.. మేకర్స్ ఏమంటున్నారంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…

Saturday, 31 January 2026, 10:37 AM

భారత్‌లోకి REDMI Note 15 Pro సిరీస్: 200MP కెమెరా, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…

Friday, 30 January 2026, 9:51 PM

హై బీపీ ఉన్నవారు రోజుకు ఎంత ఉప్పు తినాలి? గుండెను కాపాడుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!

హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…

Friday, 30 January 2026, 6:47 PM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM