నటి, యాంకర్ అనసూయ పెట్టే పోస్టులు ఎప్పుడూ సోషల్ మీడియాలో వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను లైక్ చేసే వారి కన్నా విమర్శించే వారే ఎక్కువగా ఉంటారు. దీంతో ఆమె వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటుంది. అయితే తాజాగా అనసూయ ఓ ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు.
అనసూయ నటించిన తాజా మూవీ థాంక్యూ బ్రదర్ మే 7వ తేదీన ఓటీటీలో విడుదల కానుంది. దీంతో ఆ మూవీ ప్రమోషన్లలో ఆమె బిజీగా ఉంది. అయితే మూవీ ప్రమోషన్ నేపథ్యంలో బ్లాక్ డ్రెస్తో ఆమె ఫొటోషూట్ చేసింది. తరువాత ఆ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆమె ఫొటోలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆ ఫొటోల్లో ఆమె కురచ దుస్తులు ధరించి ఉండడంతో ఆమెను మళ్లీ టార్గెట్ చేశారు.
కరోనా నేపథ్యంలో చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారని, చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఇటీవలే ఆమె సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. అయితే దాన్ని ఉద్దేశించి తాజాగా ఆమె పెట్టిన ఫొటోలను చూసి నెటిజన్లు ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. మాస్కులు ధరించాలని పిలుపునిచ్చావు సరే, బాగానే ఉంది, కానీ నువ్వు ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా ? అంటూ వారు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే తనను విమర్శించే నెటిజన్లకు అనసూయ కూడా దీటుగానే జవాబు ఇస్తుంది. మరి ఇందుకు ఆమె ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…