టాలీవుడ్లో ప్రస్తుతం సుకుమార్-బన్నీ కాంబినేషన్లో తెరకెక్కతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” లో రష్మిక హీరోయిన్గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రష్మిక మందన నాగశౌర్య హీరోగా నటించిన “చలో” మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. తరువాత గీతాగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి బ్లాక్ బస్టర్ మూవీలతో తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.
కన్నడ బ్యూటీ రష్మిక సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా కొనసాగుతూ అత్యధిక అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ అభిమాని రష్మికను కలవడానికి ఏకంగా 900 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాడట. వివరాల్లోకి వెళితే. రష్మికకు వీరాభిమాని అయినా ఆకాశ్ త్రిపాఠి హైదరాబాద్ కు చెందిన వ్యక్తి .ఈయన తన అభిమాన హీరోయిన్ ను ఒక్కసారైనా కలిసి మాట్లాడాలని భావించి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.
ఆ అభిమాని గూగుల్ ద్వారా రష్మిక స్వస్థలం కర్ణాటకలోని కొడగు సమీపంలోని విరాజ్పేట అని తెలుసుకున్నాడు. రైల్లో మైసూరుకు చేరుకొని అక్కడినుంచి ఏదో ఒక వెహికల్ పట్టుకొని రష్మిక స్వస్థలానికి చేరుకున్నాడు. అయితే అక్కడికి చేరుకున్నాక హీరోయిన్ రష్మిక ఇల్లు ఎక్కడ అంటూ కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగాడు. అతడి ప్రవర్తన తేడాగా అనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతన్ని విచారించగా అసలు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు ఆ అభిమాని. ఈ విషయం విన్న పోలీసులు రష్మిక ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ కోసం ముంబై వెళ్లినదని చెప్పి అతనిని వెనుతిరిగి పంపించారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…