డబ్బు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో ఆన్లైన్ వ్యాపారం ఒకటి. మనం ఏదైనా వ్యాపారం చేస్తే.. వస్తువులను అమ్మితే మనకు షాపు ఉంటే అక్కడకు వచ్చే వారికి మాత్రమే వస్తువులను అమ్మగలుగుతాం. కానీ ఆన్లైన్లో అలా కాదు. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న పౌరులకు అయినా సరే మన వస్తువులను అమ్మవచ్చు. అదీ ఆన్లైన్ షాపింగ్ కు ఉన్న ప్రాముఖ్యత. అయితే ఎలాంటి పెట్టుబడి లేకుండా సులభంగా చేయదగిన వ్యాపారం ఒకటి ఉంది. అదే.. ఆన్లైన్ లో మామిడి ఆకులను అమ్మడం.
మనకు పండుగలు, శుభ కార్యాలకు కొదువ లేదు. ఎప్పుడూ ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. శుభ కార్యాలు కూడా జరుగుతూనే ఉంటాయి. అయితే పండుగ అయినా శుభ కార్యం అయినా మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి ఆకులు. మామిడి ఆకులను అలంకరణల కోసం ఉపయోగిస్తారు. అంతే కాదు, పూజల్లోనూ వాడుతారు. కనుక ఆ ఆకులకు ఎంతగానో ప్రాధాన్యత ఉంది.
అయితే కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న పట్టణాలు, నగరాల వల్ల మామిడి ఆకులు సులభంగా లభ్యం కావడం లేదు. కానీ ఆన్లైన్లో వాటిని కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల మామిడి ఆకులను ఎవరైనా సరే ఆన్లైన్ లో అమ్మి సులభంగా డబ్బులు సంపాదించవచ్చు.
దీనికి గాను ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. అమెజాన్లో వ్యాపారి అకౌంట్ను క్రియేట్ చేసి అందులో మామిడి ఆకులను అమ్మవచ్చు. https://sellercentral.amazon.in/ అనే సైట్ను సందర్శిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. అమెజాన్లో కొందరు 21 మామిడి ఆకులను రూ.109కి విక్రయిస్తున్నారు.
మామిడి ఆకులు మనకు విరివిగా లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శ్రమ పడకుండానే ఈ ఆకులు దొరుకుతాయి. వాటిని సేకరించి భద్రపరిచి అమ్మవచ్చు. తాజాగా ఉండేలా చూసుకుని అమ్మితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి. అమెజాన్లో గతంలో కొందరు పిడకలను అమ్మి వ్యాపారం ప్రారంభించారు. కనుక ఈ ఆకులను కూడా అమ్మి వ్యాపారం చేయవచ్చు. అందుకు కావల్సిందల్లా కొద్దిగా శ్రమ.. ఓపిక.. అంతే.. అవి ఉండాలేగానీ మామిడి ఆకులను అమ్ముతూ చక్కని ఆదాయం పొందవచ్చు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…