Joy E-Bike : ప్రస్తుత తరుణంలో పెట్రోల్ ధరలు ఎలా మండిపోతున్నాయో అందరికీ తెలిసిందే. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బజాజ్ కంపెనీ ఫ్రీడమ్ 125 పేరిట ఓ సీఎన్జీ మోటార్ సైకిల్ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అయితే మీకు తెలుసా.. నీళ్లతో పనిచేసే స్కూటర్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయని..? అవును, మీరు విన్నది నిజమే. ఈ వాహనాలు నీళ్లతోనే పనిచేస్తాయి. ఇక ఈ వాహనాలను జాయ్ అనే కంపెనీ లాంచ్ చేసింది. వీటికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జాయ్ ఈ-బైక్ కంపెనీ వార్డ్ విజర్డ్.. హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ అండ్ ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఈ కంపెనీ నీటితో పనిచేసే స్కూటర్ను ఆవిష్కరించింది. దేశంలో స్వచ్ఛమైన ఇంధనం కోసం హైడ్రోజన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెక్నాలజీ కాలుష్యాన్ని నివారిస్తుంది కూడా. అయితే జాయ్ ఈ-బైక్ దేశంలో ఈ సంవత్సరం మొబిలిటీ షోలో నీటితో పనిచేసే స్కూటర్ను ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే వాస్తవానికి ఈ స్కూటర్ డిస్టిల్డ్ వాటర్తో పనిచేస్తుంది. ఈ వాహనాల టెక్నాలజీ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి నీటి అణువులను విభజిస్తుంది. దీంతో ఇది స్కూటర్లలో ఇంధనంగా వాడబడుతుంది. ఇక నీటితో పనిచేసే స్కూటర్లు వేగంగా వెళ్లలేవు. ఇవి గంటకు 25 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించగలవు. ఈ స్కూటర్ను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. చాలా వరకు ఆటోమొబైల్ కంపెనీలు ఈ తరహా స్కూటర్ను తయారు చేసేందుకు ప్రస్తుతం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.
ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక లీటర్ డిస్టిల్డ్ వాటర్తో సుమారుగా 150 కిలోమీటర్ల మేర దూరం వెళ్తుందని కంపెనీ చెబుతోంది. అయితే ఈ స్కూటర్ను ఇంకా డెవలప్ చేసే పనిలోనే ఉన్నారు. వాణిజ్య పరంగా ఇప్పట్లో దీన్ని ఇంకా మార్కెట్లోకి రిలీజ్ చేయలేమని చెప్పారు. కనుక నీటితో పనిచేసే ఈ స్కూటర్లను మనం త్వరలోనే మార్కెట్లో చూడవచ్చన్నమాట. అయితే ఈ స్కూటర్లతో ఎంతో డబ్బు ఆదా అవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…