Joy E-Bike : ప్రస్తుత తరుణంలో పెట్రోల్ ధరలు ఎలా మండిపోతున్నాయో అందరికీ తెలిసిందే. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బజాజ్ కంపెనీ ఫ్రీడమ్ 125 పేరిట ఓ సీఎన్జీ మోటార్ సైకిల్ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అయితే మీకు తెలుసా.. నీళ్లతో పనిచేసే స్కూటర్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయని..? అవును, మీరు విన్నది నిజమే. ఈ వాహనాలు నీళ్లతోనే పనిచేస్తాయి. ఇక ఈ వాహనాలను జాయ్ అనే కంపెనీ లాంచ్ చేసింది. వీటికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జాయ్ ఈ-బైక్ కంపెనీ వార్డ్ విజర్డ్.. హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ అండ్ ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఈ కంపెనీ నీటితో పనిచేసే స్కూటర్ను ఆవిష్కరించింది. దేశంలో స్వచ్ఛమైన ఇంధనం కోసం హైడ్రోజన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెక్నాలజీ కాలుష్యాన్ని నివారిస్తుంది కూడా. అయితే జాయ్ ఈ-బైక్ దేశంలో ఈ సంవత్సరం మొబిలిటీ షోలో నీటితో పనిచేసే స్కూటర్ను ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే వాస్తవానికి ఈ స్కూటర్ డిస్టిల్డ్ వాటర్తో పనిచేస్తుంది. ఈ వాహనాల టెక్నాలజీ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి నీటి అణువులను విభజిస్తుంది. దీంతో ఇది స్కూటర్లలో ఇంధనంగా వాడబడుతుంది. ఇక నీటితో పనిచేసే స్కూటర్లు వేగంగా వెళ్లలేవు. ఇవి గంటకు 25 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించగలవు. ఈ స్కూటర్ను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. చాలా వరకు ఆటోమొబైల్ కంపెనీలు ఈ తరహా స్కూటర్ను తయారు చేసేందుకు ప్రస్తుతం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.
ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక లీటర్ డిస్టిల్డ్ వాటర్తో సుమారుగా 150 కిలోమీటర్ల మేర దూరం వెళ్తుందని కంపెనీ చెబుతోంది. అయితే ఈ స్కూటర్ను ఇంకా డెవలప్ చేసే పనిలోనే ఉన్నారు. వాణిజ్య పరంగా ఇప్పట్లో దీన్ని ఇంకా మార్కెట్లోకి రిలీజ్ చేయలేమని చెప్పారు. కనుక నీటితో పనిచేసే ఈ స్కూటర్లను మనం త్వరలోనే మార్కెట్లో చూడవచ్చన్నమాట. అయితే ఈ స్కూటర్లతో ఎంతో డబ్బు ఆదా అవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…