Joy E-Bike : ప్రస్తుత తరుణంలో పెట్రోల్ ధరలు ఎలా మండిపోతున్నాయో అందరికీ తెలిసిందే. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బజాజ్ కంపెనీ ఫ్రీడమ్ 125 పేరిట ఓ సీఎన్జీ మోటార్ సైకిల్ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అయితే మీకు తెలుసా.. నీళ్లతో పనిచేసే స్కూటర్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయని..? అవును, మీరు విన్నది నిజమే. ఈ వాహనాలు నీళ్లతోనే పనిచేస్తాయి. ఇక ఈ వాహనాలను జాయ్ అనే కంపెనీ లాంచ్ చేసింది. వీటికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జాయ్ ఈ-బైక్ కంపెనీ వార్డ్ విజర్డ్.. హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ అండ్ ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఈ కంపెనీ నీటితో పనిచేసే స్కూటర్ను ఆవిష్కరించింది. దేశంలో స్వచ్ఛమైన ఇంధనం కోసం హైడ్రోజన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెక్నాలజీ కాలుష్యాన్ని నివారిస్తుంది కూడా. అయితే జాయ్ ఈ-బైక్ దేశంలో ఈ సంవత్సరం మొబిలిటీ షోలో నీటితో పనిచేసే స్కూటర్ను ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే వాస్తవానికి ఈ స్కూటర్ డిస్టిల్డ్ వాటర్తో పనిచేస్తుంది. ఈ వాహనాల టెక్నాలజీ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి నీటి అణువులను విభజిస్తుంది. దీంతో ఇది స్కూటర్లలో ఇంధనంగా వాడబడుతుంది. ఇక నీటితో పనిచేసే స్కూటర్లు వేగంగా వెళ్లలేవు. ఇవి గంటకు 25 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించగలవు. ఈ స్కూటర్ను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. చాలా వరకు ఆటోమొబైల్ కంపెనీలు ఈ తరహా స్కూటర్ను తయారు చేసేందుకు ప్రస్తుతం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.
ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక లీటర్ డిస్టిల్డ్ వాటర్తో సుమారుగా 150 కిలోమీటర్ల మేర దూరం వెళ్తుందని కంపెనీ చెబుతోంది. అయితే ఈ స్కూటర్ను ఇంకా డెవలప్ చేసే పనిలోనే ఉన్నారు. వాణిజ్య పరంగా ఇప్పట్లో దీన్ని ఇంకా మార్కెట్లోకి రిలీజ్ చేయలేమని చెప్పారు. కనుక నీటితో పనిచేసే ఈ స్కూటర్లను మనం త్వరలోనే మార్కెట్లో చూడవచ్చన్నమాట. అయితే ఈ స్కూటర్లతో ఎంతో డబ్బు ఆదా అవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…