సంతాన ప్రాప్తి కలగాలంటే మంగళవారం ఆంజనేయుడికి ఇలా పూజ చేయాలి..!!

September 12, 2021 8:39 PM

సాధారణంగా చాలా మందికి పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్నా సంతానం ఉండదు. ఈ క్రమంలోనే సంతానం కోసం వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ కొందరికి సంతానం కలగదు. ఈ క్రమంలోనే సంతానం కోసం మహిళలు ఎన్నో పూజలు నోములు చేస్తుంటారు. ఈ విధంగా సంతానంలేని సమస్యతో బాధపడే మహిళలు ప్రతి మంగళవారం ఆంజనేయుడికి పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

సంతాన ప్రాప్తి కలగాలంటే మంగళవారం ఆంజనేయుడికి ఇలా పూజ చేయాలి..!!

ప్రతి మంగళవారం ఉదయం సూర్యోదయానికి కంటే ముందుగా నిద్రలేచి స్నానం చేసి ఎర్రని దుస్తులు ధరించాలి. అదేవిధంగా ఆంజనేయస్వామికి తమలపాకులతో అభిషేకం చేసి, సింధూరంతో పూజించాలి. ఈ విధంగా స్వామివారికి పూజ అనంతరం ఎర్రటి పుష్పాలను సమర్పించి ఉపవాస దీక్షలతో పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుంది.

స్వామివారికి పూజ చేసిన తర్వాత కేసరి నైవేద్యంగా సమర్పించే హనుమాన్ చాలీసా చదవాలి. ఈ విధంగా సంతానం లేని దంపతులు 9 లేదా 11 మంగళవారాలు ఆంజనేయ స్వామిని ఉపవాస దీక్షలతో పూజించడం వల్ల వారికి సంతానప్రాప్తి కలుగుతుందని, అదే విధంగా ఏ విధమైనటువంటి దోషాలు, సమస్యలు ఉన్నా కూడా తొందరగా పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now