కూరలో ఉప్పు లేదని చెప్పినందుకు భర్త తల పగలగొట్టిన భార్య..!

September 8, 2021 8:51 PM

సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు కూరలో ఉప్పు, కారం తక్కువైందని చెప్పడం సర్వసాధారణమే. అయితే ఈ విధంగా చెప్పినప్పుడు ఉప్పు తక్కువైతే మరికొంత వేయడం లేదా ఎక్కువ ఉంటే అందుకు తగిన పరిష్కారాన్ని ఆలోచిస్తాం. మరికొందరు ఒక్కరోజుతో పోయేదే కదా, ఎప్పుడూ ఇలా జరగదు కదా.. అంటూ సరి పెట్టుకుని తింటుంటారు. అయితే కూరలో ఉప్పు తక్కువైందన్న పాపానికి హర్యానాలో భార్య ఏకంగా భర్త తల పగలగొట్టింది. వివరాల్లోకి వెళితే..

కూరలో ఉప్పు లేదని చెప్పినందుకు భర్త తల పగలగొట్టిన భార్య..!

హర్యానాలోని హింసార్ జిల్లాలో బార్వాలా పట్టణంలో దినేష్, బిందియా దంపతులు నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి రోజులాగే బిందియా తన భర్త కోసం వంట చేసి పెట్టింది. భోజనం చేసేటప్పుడు భర్త దినేష్ కూరలు సరిగాలేవని, కూరలో ఉప్పు తక్కువైందని చెప్పాడు. తన భర్త తను చేసిన వంటలు నచ్చలేదని చెప్పడం, వాటిల్లో ఉప్పు తగ్గిందని చెప్పడంతో.. వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ విధంగా వారిద్దరి మధ్య మాటల యుద్ధం పెరగడంతో ఇద్దరూ తారాస్థాయిలో గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే బిందియా ఎంతో ఆగ్రహానికి గురై ఇనుప రాడ్ తీసుకొని ఒక్కసారిగా తన భర్త దినేష్ తలపై కొట్టింది. ఈ విషయం గమనించిన పొరుగింటి వ్యక్తి వెంటనే దినేష్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. తన భార్యతో తనకు ఇలాంటి గొడవలు మామూలేనని, గతంలో ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయని ఈ సందర్భంగా దినేష్ తెలియజేశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now