Honey And Raisins : తేనెలో ఎండుద్రాక్ష‌ల‌ను క‌లిపి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

December 12, 2023 7:51 PM

Honey And Raisins : చాలామంది, ఆరోగ్యంగా ఉండడం కోసం, రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే తేనే, ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే, చక్కటి ఫలితం ఉంటుంది. చాలా రకాల సమస్యలకి దూరంగా కూడా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉండడం కోసం, తప్పకుండా మంచి పోషకాలతో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. చలికాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

తేనె, ఎండు ద్రాక్ష రెండిట్లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని విడిగా కాకుండా కలిపి తీసుకుంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళు తీసుకుంటే, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రక్తహీనత సమస్య నుండి బయటపడొచ్చు. ఒక సీసా తీసుకుని, అందులో ఎండు ద్రాక్ష వేసి, అవి మునిగే వరకు తేనె పోసి మూత పెట్టుకోవాలి. రెండు రోజులు కదపకుండా వదిలేసి తర్వాత ప్రతిరోజూ ఒక స్పూన్ మోతాదులో దీనిని తీసుకోవాలి. వీటిని తీసుకోవడానికి ముందు తర్వాత ఏమి ఒక అరగంట పాటు తీసుకోవద్దు.

Honey And Raisins wonderful health benefits take daily
Honey And Raisins

వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలానే, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉంటాయి. రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది చూస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. తేనె, ఎండు ద్రాక్ష ని తీసుకుంటే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. హృదయ సంబంధిత సమస్యలకి కూడా దూరంగా ఉండొచ్చు.

ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వలన, రోజంతా హుషారుగా ఉండొచ్చు. కండరాలు కూడా బలంగా ఉంటాయి. మలబద్ధకం సమస్య నుండి కూడా బయటపడొచ్చు. జీర్ణక్రియ కూడా బాగా ఉంటుంది. బలహీనతని తగ్గించుకోవాలంటే, రోజు ఈ తేనె, ఎండు ద్రాక్ష మిశ్రమాన్ని తీసుకోండి. ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి కూడా. పాలల్లో కనిపించే క్యాల్షియం కన్నా ఇది భిన్నంగా ఉంటుంది. ఇది ఎముకలని బాగా స్ట్రాంగ్ గా చేస్తుంది. చూశారు కదా తేనె, ఎండు ద్రాక్ష తీసుకుంటే ఎంత మంచిదో. రెగ్యులర్ గా దీనిని తీసుకొని సమస్యలకు దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now