ఏ గ్రహదోషంతో బాధపడే వారు.. ఎలాంటి వినాయకుడిని పూజించాలో తెలుసా ?

January 14, 2022 6:16 PM

సాధారణంగా వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా భావించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అదేవిధంగా మనం ఏ కార్యం చేయాలన్నా ముందుగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఆ కార్యంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా కాపాడుతాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ముందుగా వినాయకుడికి పూజలు నిర్వహిస్తారు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో గ్రహ దోషాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఏ విధమైనటువంటి గ్రహదోషంతో బాధపడే వారు ఎలాంటి వినాయకుడిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

*సూర్య గ్రహదోషంతో బాధపడేవారు ఎర్రచందనంతో తయారు చేసిన గణపతిని పూజించాలి.

*చంద్ర గ్రహదోషంతో బాధపడేవారు తెల్లని పాల రాయితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి.

* కుజ గ్రహదోషంతో బాధపడేవారు రాగితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి.

* బుధ గ్రహదోషంతో బాధపడేవారు మరకత గణపతిని పూజించాలి.

*గురు గ్రహదోషంతో బాధపడే వారు పసుపుతో తయారుచేసిన వినాయకుడికి పూజ చేయాలి.

*శుక్ర గ్రహదోషంతో బాధపడేవారు స్పటిక వినాయకుడిని పూజించాలి.

*శని గ్రహదోషంతో బాధపడేవారు నల్ల రాతిపై చెక్కిన వినాయకుడి విగ్రహాన్ని పూజించాలి.

*రాహుగ్రహ దోషం ఉన్నవారు మట్టితో చేసిన గణపతిని, కేతు గ్రహ దోషం ఉన్నవారు తెల్ల జిల్లేడుతో చేసిన వినాయకుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషం పోయి అనుకున్నవి నెరవేరుతాయి. కష్టాలు తప్పుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now