India vs Newzealand : ఉత్కంఠ పోరులో.. న్యూజిలాండ్‌పై భార‌త్ విజ‌యం..!

November 17, 2021 10:50 PM

India vs Newzealand : ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీలో జ‌రిగిన ప‌రాభ‌వానికి భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంది. జైపూర్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఆ జ‌ట్టు నిర్దేశించిన 165 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ కష్ట‌ప‌డుతూ ఛేదించింది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు మ్యాచ్ ఉత్కంఠ‌గా సాగింది. ఈ క్ర‌మంలో న్యూజిలాండ్‌పై భార‌త్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

India vs Newzealand india won by 5 wickets against newzealand in 1st t20 match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో కివీస్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ల‌లో మార్టిన్ గ‌ప్తిల్‌, మార్క్ చాప్‌మ‌న్‌లు అర్ధ సెంచ‌రీల‌తో రాణించారు. 42 బంతులు ఆడిన గ‌ప్తిల్ 3 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 70 ప‌రుగులు చేయ‌గా.. మార్క్ చాప్‌మ‌న్ 50 బంతులు ఆడి 6 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 63 ప‌రుగులు చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌లు 2 వికెట్ల చొప్పున తీశారు. దీపక్ చాహ‌ర్‌, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ లు చెరొక వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన భార‌త్ 19.4 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్లు కోల్పోయి 166 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌లు రాణించారు. 40 బంతులు ఆడిన యాద‌వ్ 6 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 62 ప‌రుగులు చేయ‌గా, 36 బంతుల్లో రోహిత్ శ‌ర్మ 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 48 ప‌రుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీశాడు. టిమ్ సౌతీ, మిచెల్ శాన్ట‌న‌ర్‌, డెరిల్ మిచెల్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది. ఈ మ్యాచ్‌లో విజ‌యంతో ఈ సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. మ‌రో 2 టీ20లు జ‌ర‌గ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now