కార్తీక మాసంలో ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా ?

November 16, 2021 2:21 PM

ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఆ భగవంతుని నామస్మరణలో ఉంటారు. ఈ క్రమంలోనే ఈ నెల మొత్తం ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి భావంతో పెద్దఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొంటుంటారు.

do you know why devotees do satyanarayana swamy vratham in karthika masam

కార్తీకమాసం అంటేనే ఒక పండుగ వాతావరణంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ నెలలో ఎక్కువగా గృహప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతుంటాయి.

ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలను ఎక్కువగా నిర్వహిస్తారు. అయితే కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు.. అనే విషయానికి వస్తే..

ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసానికి దామోదరుడు అధిపతిగా ఉంటాడు. కనుక ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి.

ఇక ఈ మాసంలో చాలామంది నెల మొత్తం దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలను సందర్శించి దీపాలను వెలిగించడమే కాకుండా పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేస్తారు.

ఇలా దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలం దక్కుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో విష్ణువుకి ఉసిరికాయలు అంటే ఎంతో ప్రీతికరం కనుక ఆ విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now