కోవిడ్‌పై విమ‌ర్శ‌లు చేస్తే.. ట్వీట్ల‌ను బ్లాక్ చేస్తున్నారు..!

April 26, 2021 1:32 PM

ప్రస్తుతమున్న కరోనా పరిస్థితులలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విమర్శనాత్మకంగా పలువురు చేస్తున్న ట్వీట్ లను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విట్టర్ ను కోరింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్విట్టర్ పలు ట్వీట్ లను బ్లాక్ చేసింది. ఈ విధంగా ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ట్వీట్ చేసిన వారిలో ఎంతో మంది ప్రముఖులు కూడా ఉన్నారు.

ఈ విధంగా పలువురు చేసే ట్వీట్లు భారత ఐటీ చట్టానికి అనుగుణంగా లేవని, ఇవి చట్టాన్ని విమర్శించేలా ఉన్నాయంటూ ప్రభుత్వం ట్విట్టర్ కి పంపిన నోటీసులో పేర్కొంది. ఈ ట్వీట్స్ ద్వారా కోవిడ్ పరిస్థితుల పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, ముందుచూపు లేని కారణంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి అంటూ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

ఈ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కుంభమేళాకు ఏ విధమైన ముందుచూపు కట్టడి చర్యలు లేకుండా అనుమతి ఇవ్వడం వల్లే ఈ వైరస్ మరింత ప్రబలిందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ విధమైనటువంటి ట్వీట్స్ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం చెందడంతో వీటిని బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విట్టర్ ను కోరింది. గతంలో కూడా లోగడ రైతుల నిరసనలపై వచ్చిన ట్వీట్స్ విషయంలో ప్రభుత్వం ఇదే తీరు ప్రవర్తించడం మనకు తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now