Mahesh Babu : మొట్టమొదటిసారిగా లక్ష్మీ నరసింహ స్వామి రూపంలో మహేష్ ?

October 5, 2021 12:42 PM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో స్టైలిష్ లుక్ లో వెండితెరపై కనబడుతూ ఎంతోమంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది.

Mahesh Babu : మొట్టమొదటిసారిగా లక్ష్మీ నరసింహ స్వామి రూపంలో మహేష్ ?
Mahesh Babu to appear in new look

Mahesh Babu : లక్ష్మీ నరసింహస్వామి రూపంలో..

ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్, గోవా, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరిగింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఇంటర్వెల్ ముందు ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఉందని.. అందులో మహేష్ బాబు ఇదివరకు ఎప్పుడూ కనిపించని లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం.

ఈ యాక్షన్ సన్నివేశంలో మహేష్ బాబు విలన్లకు ఏకంగా లక్ష్మీ నరసింహస్వామి రూపంలో కనిపించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now