ఆపరేషన్లు చేసేటప్పుడు సహజంగానే డాక్టర్లు మత్తు మందు ఇస్తారు. కానీ కొన్ని ఆపరేషన్లకు మత్తు మందు ఇవ్వరు. కేవలం ఆపరేషన్ చేసే భాగానికి మాత్రమే స్పర్శ లేకుండా చేస్తారు. అయితే బ్రెయిన్ ట్యూమర్ను తొలగించే ఆపరేషన్లను కూడా అలాగే చేస్తారు. మెదడులో సూక్ష్మమైన కణాలు ఉంటాయి. అవి దెబ్బ తినకుండా ఉండేందుకు పేషెంట్లకు మత్తు మందు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తారు. కానీ తల భాగం స్పర్శ లేకుండా చేస్తారు.
అయితే ఓ మహిళకు ఆ విధంగానే బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేశారు. కానీ ఆ మహిళ ఆపరేషన్ చేసిన సమయంలో హనుమాన్ చాలీసాను పఠించింది. అందులో ఉన్న మొత్తం 40 శ్లోకాలను ఆమె చదివింది. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ అయింది.
ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆ మహిళకు తాజాగా సదరు ఆపరేషన్ను నిర్వహించారు. అయితే ఆపరేషన్ 3 గంటల పాటు కొనసాగింది. కానీ ఆ సమయంలో ఆమె మెళకువగా ఉన్నప్పటికీ ఆమె హనుమాన్ చాలీసాను పఠించింది. డాక్టర్లు ఆమెకు విజయవంతంగా సర్జరీ చేసి ట్యూమర్ను తొలగించారు. ఈ సందర్బంగా ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్ దీపక్ గుప్తా వివరాలను వెల్లడించారు. అయితే ఆమె అలా హనుమాన్ చాలీసా చదువుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంత ధైర్యంగా ఉన్నందుకు ఆమెను అందరూ ప్రశంసిస్తున్నారు.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…