ఒకప్పుడు దేవతా విగ్రహాలకు భక్తులు పెద్ద ఎత్తున బంగారు లేదా వెండి కిరీటాలను, ఇతర అలంకరణ వస్తువులను కానుకలుగా ఇచ్చేవారు. అయితే తాజాగా కరోనా పరిస్థితుల ప్రభావం వల్ల మనిషి జీవితంలో మాస్క్ అనేది ఒక భాగమైపోయింది. ఈ క్రమంలోనే అమ్మవారి అలంకరణలో కూడా మాస్క్ భాగమైంది. తాజాగా కోల్కతా బగుయాటీ ఏరియాలోని పూజా మండపంలో అమ్మవారికి 20 గ్రాముల బంగారంతో చేసిన మాస్క్ తొడిగారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేవలం అమ్మవారి విగ్రహానికి మాస్క్ తోడగడమే కాకుండా అమ్మవారి చేతిలో ఆయుధాలకు బదులుగా శానిటైజర్ లు, సిరంజీలు, ఆక్సి మీటర్లు, వంటి వైద్య పరికరాలు ఉంచడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేయడానికి కూడా ఒక కారణం ఉంది.ఈ విధంగా అమ్మవారికి మాస్క్ వేయటం వల్ల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు సైతం మాస్కులు ధరిస్తారని, ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలను పాటించడం వల్ల కరోనాను తరిమికొట్టడానికి వీలవుతుందని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అమ్మవారి విగ్రహం ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా అమ్మ వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, బెంగాల్ సింగర్ అదితీ మున్షీ అన్నారు. బెంగాల్లో అత్యంత వైభవంగా జరిగే కాళీ మాత వేడుకలలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనడం వల్ల కరోనా వ్యాప్తికి కారకులవుతారు కనుక ఈ క్రమంలోనే ప్రజలు పెద్ద ఎత్తున ఒకేచోట చేరకుండా ఎక్కడికక్కడ ఈ విధమైనటువంటి ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…