Salt : వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం ఉప్పును ఉపయోగించడం వల్ల మనం అనేక దోషాల నుండి బయటపడవచ్చు. ఉప్పును ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. అలాగే ఉప్పును లక్ష్మీదేవితో పోల్చుతారు. అందుకే ఉప్పును తొక్కకూడదని ఒకరి చేతి నుండి మరొకరి చేతికి ఉప్పును ఇవ్వకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే నీటిలో ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ విధంగా ఉప్పుకు సంబంధించిన అనేక పరిహారాలను మనం నిత్యం చేస్తూ ఉంటాము.
వాస్తు శాస్త్రంలో ఉన్న ఉప్పు గురించిన మరో పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు మూట కట్టడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పును కట్టడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఉప్పు కట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో గొడవలు జరగకుండా ఉంటాయి. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల ఇంటి యజమాని జాతకంలో ఉండే శుక్ర దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి.
ఆర్థిక సంక్షోభం నుండి త్వరగా బయటపడతారు. అప్పులు తొలగిపోవడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో ప్రశాంతత, సుఖ సంతోషాలు నెలకొంటాయి. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఈవిధంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పును కట్టడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…
థియేటర్లలో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు కూడా ఈ ప్లాట్ఫామ్కు బాగా అలవాటు పడ్డారు.…
తనను విమర్శించే వారిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని నటి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. తన సొంత బ్యానర్పై తెరకెక్కుతున్న…
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్ఫామ్లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…