Pocket : మనలో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రానికి అనుగుణంగా పనులు చేస్తూ ఉంటారు. ఇంటి నిర్మాణంలో కూడా వాస్తు శాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించేవారు ఉన్నారు. అన్ని సరిగ్గా ఉంటేనే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. అలాగే ఈ నెగెటివ్ ఎనర్జీ ఇంటిపైనే కాకుండా ఇంట్లో ఉండే వారిపై కూడా ఉంటుంది. కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల ఈ నెగెటివ్ ఎనర్జీ నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ మూడు వస్తువులను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
మీపై చెడు దృష్టి పడకుండా ఉంటుంది. వాస్తు దోషాలు తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం మీ వద్ద ఉంచుకోవలసిన వస్తువులు ఏమిటో… ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం మీ వద్ద ఉండాల్సిన వస్తువులల్లో అగ్గిపెట్టె కూడా ఒకటి. అగ్గి పెట్టె మీ వద్ద ఉండడం వల్ల దుష్టశక్తులు మీకు దూరంగా ఉంటాయి. మీపై చెడు దృష్టి పడకుండా ఉంటుంది. అలాగే కర్పూరాన్ని కూడా ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ దూరమవుతుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు కలిసి వస్తుంది. అలాగే మీ దగ్గర ఉంచుకోవాల్సిన మరో వస్తువు బిర్యానీ ఆకు. దీనిని వంటలల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు.
బిర్యానీ ఆకును మీ జేబులో ఉంచుకోవడం వల్ల రాహు సంబంధిత దోషాలు తొలగిపోతాయి. మీరు ఏ ఆటంకం లేకుండా పనులు చేసుకోగలుగుతారు. ఈ విధంగా ఈ మూడు వస్తువులను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీకు దిష్టి తగలకుండా ఉంటుంది. ఎటువంటి దుష్టశక్తులు మీ దరి చేరకుండా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన…
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…
థియేటర్లలో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు కూడా ఈ ప్లాట్ఫామ్కు బాగా అలవాటు పడ్డారు.…
తనను విమర్శించే వారిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని నటి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. తన సొంత బ్యానర్పై తెరకెక్కుతున్న…
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్ఫామ్లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…