Lemon Pepper Rasam Rice : రసం రైస్.. ఇది మనందరికి తెలిసిందే. రసం రైస్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. అలాగే తరుచూగా దీనిని ఇంట్లో తయారు చేస్తూ ఉంటారు కూడా. ఈ రసం రైస్ ను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేసే లెమన్ పెప్పర్ రసం రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా దీనిని తీసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు దీనిని చాలా సులభంగా తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా ఈ రసం రైస్ ను తయారు చేసుకోవచ్చు. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు దీనిని సులభంగా తయారు చేసి తీసుకోవచ్చు. పుల్ల పుల్లగా, ఘాటుగా, కమ్మగా ఉండే ఈ లెమన్ పెప్పర్ రసం రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ పెప్పర్ రసం రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, కందిపప్పు లేదా పెసరపప్పు – 4 టేబుల్ స్పూన్స్, తరిగిన టమాటాలు – 2, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – 3 కప్పులు, మిరియాలు – అర టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, రసం పొడి – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – గుప్పెడు, ఆవాలు – ఒక టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, దంచిన వెల్లుల్లి రెమ్మలు – 8, ఇంగువ – అర టీ స్పూన్, వేడి నీళ్లు – 600 ఎమ్ ఎల్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – ఒకటిన్నర చెక్క.
లెమన్ పెప్పర్ రసం రైస్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బియ్యం, కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి గంట పాటు నానబెట్టాలి. తరువాత ఈ బియ్యాన్ని కుక్కర్ లో వేసుకోవాలి. ఇందులో నీళ్లు, పసుపు, టమాట ముక్కలు వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో రసం పొడిని తీసుకోవాలి. ఇందులో 4 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యిలో ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఇంగువ, దంచిన వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించాలి.
తరువాత ఉడికించిన అన్నాన్ని మెత్తగా చేసి వేసుకోవాలి. ఇందులో వేడి నీళ్లు పోసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత ఉప్పు, కొత్తిమీర, నీటిలో కలిపిన రసం పొడి వేసి బాగా కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మిరియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 10 నుండి 12 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పైన వేయించిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లెమన్ పెప్పర్ రసం రైస్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
పబ్లిక్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన…
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…
థియేటర్లలో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు కూడా ఈ ప్లాట్ఫామ్కు బాగా అలవాటు పడ్డారు.…
తనను విమర్శించే వారిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని నటి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. తన సొంత బ్యానర్పై తెరకెక్కుతున్న…
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్ఫామ్లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…