Vehicle : ఈరోజుల్లో ఎక్కువమంది కార్లు, టూవీలర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సొంత వాహనం కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. టూవీలర్ అయినా లేదంటే కార్ అయినా సరే చాలామంది కష్టపడి కొనుక్కుంటూ ఉంటారు. ఆ వాహనాన్ని కొనుక్కోవాలి, ఈ వాహనాన్ని కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటారు. దానిని కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే వాహనాన్ని కొనేటప్పుడు ఎటువంటి విషయాలని ఆచరించాలి, వేటిని గుర్తు పెట్టుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడైనా సరే కొత్త వాహనాలని కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కొన్ని ప్రత్యేక వాస్తు నియమాలను పాటించాలి. అప్పుడే జీవితంలో ఆనందం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు వాటిని పాటించకపోతే అనేక సమస్యలు వస్తాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు వాస్తు నియమాలని పాటిస్తే అంతా మంచే జరుగుతుంది. చక్కటి ఫలితం ఉంటుంది.
వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆరోజు మంచి రోజా కాదా అనేది చూసుకుని ఆ తర్వాత మాత్రమే వాహనాన్ని కొనుగోలు చేయాలి. పౌర్ణమి నాడు లేదంటే పౌర్ణమికి పది రోజులు ముందు, లేదంటే 10 రోజుల తర్వాత ఏదైనా మంచి రోజు చూసుకుని కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది. పౌర్ణమి తర్వాత 11వ రోజు నుండి 15వ రోజు వరకు వాహనాలని కొనుగోలు చేయకూడదు. శనివారం అస్సలు కొత్త వాహనాన్ని కొనకూడదు. అమావాస్య నాడు కూడా అసలు కొనకూడదు. అయితే ఎవరికి నచ్చిన వాహనాన్ని వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎవరికి నచ్చిన రంగుల్ని వాళ్ళు ఎంపిక చేసుకుంటూ ఉంటారు.
తెలుపు, వెండి రంగు, లేత రంగులు శుభప్రదంగా పరిగణించబడతాయి. అటువంటి వాటిని కొనుగోలు చేస్తే మంచిది. ఇవి సానుకూలత, స్వచ్ఛతకు చిహ్నం. మేషరాశి వాళ్ళకి ఎరుపు లేదంటే మెరూన్ రంగు మంచిది. ఇలా మీరు చూసుకుని మీరు రాశిని బట్టి కొనుగోలు చేయవచ్చు. అలాగే మీరు వాహనం పెట్టే చోటు ఎప్పుడూ వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. సులువుగా లోపలికి, బయటికి తీసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పార్కింగ్ ప్లేస్ ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. సానుకూల శక్తి కలగాలంటే వెలుతురు ఉండే బహిరంగ ప్రదేశంలో పార్కింగ్ చేయడం మంచిది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…