మీకూ రేషన్ కార్డు ఉందా.. అయితే మీకు ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మాదిరిగానే రేషన్ కార్డు కూడా ఎంతో విలువైనది అని చెప్పవచ్చు. రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ రకాల నిత్యావసర సరుకులను తక్కువ ధరకే మనం పొందవచ్చు. ప్రతి నెల ఈ రేషన్ సరుకులను మనం ప్రభుత్వ రేషన్ దుకాణానికి వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. మరి కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం అందించే టటువంటి ఈ సరుకులు ప్రజల ఇంటివద్దకే వెళ్లి అందిస్తున్నారు.అయితే ఇకపై రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి అనే బాధ వినియోగదారులకు తప్పుతుందని చెప్పవచ్చు.
రేషన్ సరుకులు పొందాలంటే మరికొన్ని రోజులలో ఏటీఎంల ద్వారా రేషన్ బియ్యాన్ని పొందవచ్చు. ఇప్పటికే హరియాణాలోని గురుగ్రామ్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద రేషన్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. దేశంలోనే ఇది మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం అని చెప్పవచ్చు. రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఏటీఎం దగ్గరికి వెళ్లి వేలిముద్ర పెడితే మనకు రావాల్సిన సరుకులు మనకు వస్తాయి.
గ్రెయిన్ ఏటీఎం దగ్గర వేలి ముద్రతో పాటు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ నంబర్లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.ఈ విధంగా ఏటీఎం ద్వారా రేషన్ సరుకులను అందుబాటులోకి తీసుకురావటం వల్ల నెలకు ఒకసారి మనకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు సరుకులను తీసుకోవచ్చు. అదేవిధంగా ఏటీఎం ద్వారా సరుకులను ఖచ్చితమైన తూకానికే పొందవచ్చు. ఈ విధంగా ఏటీఎం ద్వారా సరుకులను పొందడం నిజంగానే లబ్ధిదారులకు ఉపశమనం కలిగించే విషయమని చెప్పవచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…