భార‌త‌దేశం

24 ఏళ్ల కింద‌ట చ‌నిపోయాడ‌నుకున్న వ్య‌క్తి.. ఇప్పుడు మ‌ళ్లీ తిరిగొచ్చాడు.. ఆశ్చ‌ర్యంలో కుటుంబ స‌భ్యులు..!

క‌నిపించ‌కుండా పోయిన వ్య‌క్తులు తిరిగి కుటంబ స‌భ్యుల‌ను చేరుకోవడం అనేది చాలా అరుదుగా జ‌రుగుతుంటుంది. పోలీసులు అన్ని విధాలుగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే కొంత వ‌ర‌కు ఈ విష‌యంలో ఫ‌లితం ద‌క్క‌వ‌చ్చు. కానీ ఒక్కోసారి వారు కూడా ఏమీ చేయ‌లేరు. దీంతో మిస్సింగ్ అయిన వ్య‌క్తుల వివ‌రాలు అస‌లు ఏమీ తెలియవు. అయితే ఆ వ్య‌క్తి కూడా ఇలాగే 24 ఏళ్ల కింద‌ట ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లి కనిపించ‌కుండా పోయాడు. చాలా ఏళ్లు గ‌డిచాయి. ఇక అత‌ను చ‌నిపోయాడ‌నే అంద‌రూ భావించారు. కానీ ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ అత‌ను ఇప్పుడు ఇంటికి తిరిగొచ్చాడు. దీంతో కుటుంబ స‌భ్యులు ఓ వైపు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూనే మ‌రో వైపు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఉత్త‌రాఖండ్ లోని అల్మోరా జిల్లాలో ఉన్న రాణిఖేత్ అనే ప్రాతానికి చెందిన మ‌ధో సింగ్ మెహ్రా 24 ఏళ్ల కింద‌ట ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అత‌ని కుటుంబ స‌భ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే ఎన్ని ఏళ్లు గ‌డిచినా అత‌ను తిరిగి రాలేదు. దీంతో అత‌ను చ‌నిపోయి ఉంటాడ‌ని భావించిన కుటుంబ స‌భ్యులు అత‌నికి ప్ర‌తి ఏడాది క‌ర్మ‌లు చేయ‌డం ప్రారంభించారు.

అయితే ఇటీవ‌లే అత‌ను త‌మ గ్రామానికి స‌మీపంలోని పొలాల్లో కొంద‌రికి క‌నిపించాడు. అత‌నికిప్పుడు 72 ఏళ్లు కావ‌డంతో వృద్ధాప్యం వచ్చేసింది. అయిన‌ప్ప‌టికీ గ్రామ వాసులు అత‌న్ని గుర్తించి అత‌న్ని ఇంటికి తీసుకువ‌చ్చారు. అయితే కుటుంబ స‌భ్యులు మొద‌ట ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసినా త‌రువాత భ‌య‌ప‌డ్డారు. అత‌ను చ‌నిపోయాడ‌ని ఇన్నాళ్లూ అత‌నికి క‌ర్మ‌లు చేశారు క‌నుక‌.. దాని నుంచి విముక్తి పొందాలంటే మ‌ధో సింగ్‌కు మ‌ళ్లీ నామ‌క‌ర‌ణం చేసే కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని పండితులు చెప్పారు. దీంతో వారు అత‌న్ని అప్ప‌టి వ‌ర‌కు ఇంట్లోకి రానిచ్చేది లేద‌ని చెబుతూ ఇంటి బ‌య‌టే టెంటు వేసి ఉంచారు. త్వ‌ర‌లో ఆ తంతు ముగియ‌గానే మ‌ళ్లీ అత‌న్ని ఇంట్లోకి తీసుకువెళ్తామ‌ని చెబుతున్నారు.

ఇక అత‌నికి భార్య, కుమారుడు, కుమార్తె ఉండ‌గా వారికి పెళ్లిళ్లు అయిపోయి స్థిర ప‌డ్డారు. మ‌ధో సింగ్ అదృశ్యం అయిన‌ప్ప‌టి నుంచి అత‌ని భార్య విధ‌వ‌గానే ఉంటోంది. మ‌ధోసింగ్ మిస్సింగ్ అయిన‌ప్పుడు అత‌ని పిల్ల‌లు చాలా చిన్న‌వారు. ఇప్పుడు అత‌ను వృద్ధుడు అయ్యాడు. పిల్లలు పెద్ద‌గై పెళ్లి చేసుకున్నారు. దీంతో అంతా ఒక్క‌సారిగా మారిపోయింది. అయితే అత‌ను ఇన్ని రోజులూ ఎక్క‌డ ఉన్నాడు, ఏం చేశాడు, అస‌లు మ‌ళ్లీ సొంత ఊరికి ఎలా వ‌చ్చాడు ? అనే వివ‌రాల‌ను అత‌ను గుర్తు పెట్టుకోలేదు. ఎవ‌రేం అడిగినా త‌న‌కు ఏమీ గుర్తు లేద‌ని చెబుతున్నాడు. ఏది ఏమైనా.. ఇది చాలా వింత‌గా అనిపిస్తోంది క‌దా..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

దసరా బరిలో ప్రభాస్ ‘ఫౌజీ’? రిలీజ్ డేట్‌పై నెట్టింట క్రేజీ ప్రచారం.. మేకర్స్ ఏమంటున్నారంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…

Saturday, 31 January 2026, 10:37 AM

భారత్‌లోకి REDMI Note 15 Pro సిరీస్: 200MP కెమెరా, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…

Friday, 30 January 2026, 9:51 PM

హై బీపీ ఉన్నవారు రోజుకు ఎంత ఉప్పు తినాలి? గుండెను కాపాడుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!

హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…

Friday, 30 January 2026, 6:47 PM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM