కొత్త వాహనం కొనాలనుకునే వారికి మద్రాస్ హైకోర్టు షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. బంపర్ టూ బంపర్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వాహనాల ధరలు పెరగనున్నాయి. ఈ ఇన్సూరెన్స్ కారణంగా సెప్టెంబర్ 1 నుంచి వాహనాలపై అయిదేళ్ల భీమా తప్పనిసరి కానుంది. ఈ క్రమంలోనే వాహనాలపై 10 శాతం మేర ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు టూ వీలర్స్ పై సుమారుగా రూ.5 వేల నుంచి రూ.6 వేల ధర పెరగడమే కాకుండా, ఎంట్రీ లెవల్ కార్ల కొనుగోలుపై రూ.50,000, ఎస్యూవీ కార్ల పై రూ.2 లక్షల వరకు భారం పడుతుందని ఫాడా ప్రెసిడెంట్ వింకేశ్ గులాటి వెల్లడించారు. సాధారణంగా లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేసేటప్పుడు ప్రీమియం భారం తగ్గించడానికి చాలా మంది ఎన్నో పథకాలు వేస్తారు. అలాంటి సమయంలో బంపర్ టూ బంపర్ ఇన్సూరెన్స్ చేయటం వల్ల కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఉన్న వ్యక్తులకు కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
కోర్టు తీర్పు కారణంగా ఒక వాహనంపై 3 శాతం మొత్తాన్ని ఐదేళ్లకు పెంచడంవల్ల మార్కెట్ వాల్యూ తగ్గుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇన్సూరెన్స్ ప్రీమియం దాదాపుగా 3 శాతం వరకు పెరుగుతుంది. ఈ క్రమంలోనే వాహన ధరలు కూడా పెరిగిపోతాయి. కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆటోమొబైల్ పరిశ్రమపై మద్రాస్ హైకోర్టు ఈ విధమైన తీర్పు ఇవ్వడంతో ఆ ప్రభావం అమ్మకాలపై పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…