Train Seats : బస్ ప్రయాణం అయినా ఇబ్బంది పడేవారుంటారు కానీ ట్రెయిన్ జర్నీ అంటే ఎగిరి గంతేయని వారుండరు. చిన్నప్పుడైతే ట్రెయిన్ లో విండో సీట్ వస్తే బాగుండును అని అనుకుంటాం. ఇప్పటికీ కూడా విండో సీట్ కావాలనుకునే వారుంటారు. నిద్ర ప్రియులైతే అప్పర్ బెర్త్ వస్తే హ్యాపీగా పడుకోవచ్చు అనుకుంటారు. కానీ ఈ సీట్ల కేటాయింపు వెనుక సైన్స్ ఉందని తెలుసా.. బస్ అంటే మనకు కావాలసిన సీట్ బుక్ చేసుకుంటాం. సినిమా హాల్లో అయినా మనకు నచ్చిన సీట్ తీసుకుంటాం. కానీ ట్రెయిన్లో అలా కుదరదు. వాళ్లు ఏ సీట్ కేటాయిస్తే అదే తీసుకోవాలసి ఉంటుంది. అసలు ట్రెయిన్ లో సీట్ లను ఎలా కేటాయిస్తారో తెలుసా. దానికోసం వారు ఎలాంటి క్రమపద్ధతిని అనుసరిస్తారో తెలుసా. క్రమ పద్ధతి పాటించకపోతే ట్రెయిన్ పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుందని మీకు తెలుసా. అవన్నీ విషయాలను తెలుసుకోండి.
ప్రయాణికుల బరువును అన్ని కోచ్ల్లో, అన్నివైపులా సమానంగా పంచేలా ఐఆర్సీటీసీ సాఫ్ట్వేర్ టికెట్లను బుక్చేస్తుంది. ఒక రైలులో 10 స్లీపర్ క్లాస్ కోచ్లు (ఎస్ 1- ఎస్10) ఉన్నాయనుకుందాం. ఒక్కో కోచ్లో 72 సీట్లతో మొత్తం 720 సీట్లు ఉంటాయి. మొదటగా బుక్చేసుకునే వ్యక్తికి మధ్యభాగంలో అంటే ఎస్-5 బోగీలో సాఫ్ట్వేర్ సీటును కేటాయిస్తుంది. కోచ్లోనూ మిడిల్ సీటు నుంచి టిక్కెట్లను బుక్ చేస్తుంది. అంటే 72 సీట్లుంటే 36వ సీటును కేటాయిస్తుంది. ఇక చివరగా బుక్చేసుకునే వ్యక్తికి ఎస్1 లేదా ఎస్ 10 బోగీలో సీటును బుక్చేస్తుంది.
బెర్త్ విషయంలోనూ మొదటగా లోయర్ బెర్త్, ఆ తర్వాత మిడిల్ బెర్త్, చివరకు అప్పర్బెర్త్ను కేటాయిస్తుంది. అలా కాకుండా ఒక క్రమపద్ధతి లేకుండా టికెట్లను కేటాయిస్తే.. కొన్ని బోగీలు పూర్తిగా నిండిపోయి, మరికొన్ని ఖాళీగా ఉండే అవకాశముంది. ఇలాంటి సమయాల్లో ములుపుల దగ్గర ట్రైన్ పడిపోయే ప్రమాదముంటుంది. కొన్ని బోగీలపై ఎక్కువ అపకేంద్రబలముంటే, మరికొన్నింటిపై తక్కువగా ఉంటుంది. ఫలితంగా రైలు పట్టాలు తప్పుతుంది. అందుకే రైలు ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు భద్రతా చర్యల్లో భాగంగానే సీట్ల కేటాయింపును ఇలా ఒక క్రమపద్ధతిలో చేస్తారు. అందువల్లే మనకు రైళ్లలో మనకు కావల్సిన సీటును బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండదు. సాఫ్ట్వేర్ ఆటోమేటిగ్గా మనకు ఆ పని చేసి పెడుతుంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…