LPG Gas Cylinder Rules : ప్రస్తుత తరుణంలో చాలా మంది వంట గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు అందుబాటులో ఉండేలా నూతన పథకాలను అందజేస్తున్నారు. దీంతో వంట గ్యాస్ వినియోగం పెరిగింది. ఇక దేశంలో ప్రస్తుతం వంట గ్యాస్ వినియోగదారుల సంఖ్య 14.45 కోట్లు ఉండగా, ఇందులో 10 కోట్ల మందికి పైగా సబ్సిడీని పొందుతున్నారు. అలాగే మహిళలు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నారు. అయితే ఇకపై వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో నిబంధనలను మార్చనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వర్గాలకు మేలు చేసేందుకే ఈ నిబంధనలను అమలు చేయనున్నట్లు సమాచారం.
ఇకపై వంట గ్యాస్ సిలిండర్ను బుక్ చేయాలంటే అందుకు గాను వినియోగదారుడు తన ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ బయోమెట్రిక్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు గాను ముందుగా వినియోగదారుడు తనకు ఉన్న సిలిండర్కు చెందిన గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత నుంచి బయోమెట్రిక్ వేసి సిలిండర్ను బుక్ చేయాలి. అయితే ఈ నిబంధన వల్ల అక్రమాలను అడ్డుకోవచ్చని, కేంద్రం ఇచ్చే లబ్ధి నేరుగా లబ్ధిదారులకు చేరుతుందని అంటున్నారు. అయితే ఇది ప్రస్తుతం ఉన్న వినియోగదారులకా లేక కొత్త వినియోగదారులకా అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
కాగా మరోవైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వంట గ్యాస్ సిలిండర్పై క్రమంగా సబ్సిడీని తగ్గిస్తూ వస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులకు కంపెనీని బట్టి కేవలం రూ.30 నుంచి రూ.50 వరకు మాత్రమే సిలిండర్పై సబ్సిడీని అందిస్తున్నారు. ఇక త్వరలోనూ దాన్ని కూడా ఎత్తేస్తారని సమాచారం. ఆ తరువాత పేదలకు మరిన్ని ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను అందిస్తారని తెలుస్తోంది. అయితే కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తేనే ఇలా జరుగుతుందని, యూపీఏ వస్తే నిబంధనలను మరోలా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…