వాట్సాప్లో మెసేజ్లను డిలీట్ చేసే ఫీచర్ అందుబాటులో ఉన్న విషయం విదితమే. వాట్సాప్ ఈ ఫీచర్ను 2017లోనే అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సహాయంలో వాట్సాప్లో పంపే మెసేజ్లతోపాటు ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయవచ్చు. కానీ వాటిని పంపిన 7 నిమిషాల్లోగా డిలీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే అవి డిలీట్ కావు. అయితే ఆయా మెసేజ్లను పొరపాటుగా డిలీట్ చేస్తే ఇంక అంతే సంగతులు. వాటిని మళ్లీ యాక్సెస్ చేయలేం. అలాగే ఇతరులు మనకు పంపే మెసేజ్లను వారు డిలీట్ చేసినా వాటిని మనం చూడలేం. కానీ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న ఓ యాప్ సహాయంతో వాట్సాప్లో డిలీట్ చేసిన మెసేజ్లను కూడా చూడవచ్చు. అందుకు గాను ఈ యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న నోటిసేవ్ (Notisave) అనే యాప్ను డౌన్లోడ్ చేసి ఫోన్లో ఇన్స్టాల్ చేయాలి. అనంతరం యాప్ను ఓపెన్ చేసి అన్ని పర్మిషన్లను ఇవ్వాలి. దీంతో మీ వాట్సాప్కు వచ్చే అన్ని రకాల మెసేజ్లను ఈ యాప్ ట్రాక్ చేస్తుంది. వాటిని తన దగ్గర స్టోర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో వాట్సాప్లో ఏ మెసేజ్లను అయినా సరే డిలీట్ చేస్తే వాటిని నోటిసేవ్ యాప్లో చూడవచ్చు. ఇలా ఈ యాప్ పనిచేస్తుంది.
ఈ యాప్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఫ్రీ వెర్షన్లో యాడ్స్ వస్తాయి. కానీ రూ.65 పెట్టి పెయిడ్ వెర్షన్ను కొనుగోలు చేస్తే యాడ్స్ రాకుండా ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్లో డిలీట్ చేయబడిన మెసేజ్లను చదివేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…