దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు శాంసంగ్ శుభవార్త చెప్పింది. శాంసంగ్కు చెందిన ఫోన్లు, ట్యాబ్లను వాడేవారు వాటిని రిపేర్ చేయించాల్సి వస్తే ఇకపై సర్వీస్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. ఆ కంపెనీ వారే వచ్చి డివైస్లను తీసుకెళ్లి రిపేర్ చేసి మళ్లీ వాటిని డెలివరీ చేస్తారు. ఈ క్రమంలోనే శాంసంగ్ ఈ కార్యక్రమానికి పికప్ అండ్ డ్రాప్ సర్వీస్గా పేరు పెట్టింది. ఇందులో భాగంగా రెండు రకాల సేవలు వినియోగదారులకు లభిస్తాయి.
కస్టమర్లు తమ శాంసంగ్ ఫోన్ లేదా ట్యాబ్ ను సర్వీస్ సెంటర్లో ఇచ్చి డెలివరీ ఆర్డర్ పెట్టవచ్చు. అంటే కేవలం డ్రాప్ మాత్రమే అన్నమాట. ఇందుకు రూ.99 ఫీజు తీసుకుంటారు. ఇక ఫోన్ను తీసుకెళ్లి రిపేర్ చేసి తీసుకొస్తే పికప్ అండ్ డ్రాప్ కింద రూ.199 తీసుకుంటారు. ఈ క్రమంలోనే శాంసంగ్ గెలాక్సీ ఎ, గెలాక్సీ ఎమ్, గెలాక్సీ ఎస్, గెలాక్సీ ఎఫ్, గెలాక్సీ నోట్, గెలాక్సీ ఫోల్డ్ సిరీస్ ఫోన్లు, గెలాక్సీ ట్యాబ్లను వాడేవారు ఈ సేవను ఉపయోగించుకోవచ్చు.
ఇక ప్రస్తుతం శాంసంగ్కు చెందిన పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ పలు ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లోనే అందుబాటులో ఉంది.
ఢిల్లీ, గుర్గావ్, ముంబై, కోల్కతా, చెన్నై, పూణె, బెంగళూరు, అహ్మదాబాద్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా, చండీగఢ్, లూథియానా, జలంధర్, జైపూర్, ఉదయ్పూర్, జోధ్ పూర్, ఆగ్రా, లక్నో, వారణాసి, డెహ్రాడూన్, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, దుర్గాపూర్, రాంచీ, థానె, ఔరంగాబాద్, కోల్హాపూర్, నాగ్పూర్, సూరత్, వడోదర, భోపాల్, ఇండోర్, రాయ్పూర్, రాజ్కోట్, జబల్పూర్, కోయంబత్తూర్, మదురై, కొచ్చి, కాలికట్, తిరుపతి, హుబ్లి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ఈ సేవ అందుబాటులో ఉంది.
కరోనా వల్ల చాలా మంది బయటకు రావడానికే భయపడుతున్నారని, అలాంటి పరిస్థితిలో తాము అందిస్తున్న ఈ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఎంతో మందికి ఉపయోగంగా ఉంటుందని శాంసంగ్ ఇండియా కస్టమర్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ కుటిన్హా వెల్లడించారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…