మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ 11 అల్ట్రా పేరిట ఓ నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ను భారత్లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.81 ఇంచుల అమోలెడ్ క్వాడ్ కర్వ్డ్ డాట్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. డిస్ప్లేకు డాల్బీ విజన్ సపోర్ట్ను కూడా అందిస్తున్నారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇక 1.1 ఇంచుల సైజ్ ఉన్న మరో సెకండరీ అమోలెడ్ డిస్ప్లేను కూడా ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. దీని సహాయంతో నోటిఫికేషన్లు చెక్ చేయవచ్చు. సెల్ఫీలను ప్రివ్యూ చూడవచ్చు.
ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ను అమర్చారు. 12 జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 48 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా, 48 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్కు ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఏర్పాటు చేశారు. దీనికి 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 67 వాట్ల వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్ కేవలం 36 నిమిషాల్లోనే పూర్తిగా చార్జింగ్ అవుతుంది. ఇక ఫోన్తోపాటు 55 వాట్ల చార్జర్ను అందిస్తారు. 67 వాట్ల చార్జర్ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు.
షియోమీ ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సెరామిక్ బ్లాక్, సెరామిక్ వైట్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.69,999గా ఉంది. దీన్ని త్వరలోనే అమెజాన్తోపాటు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్లలో విక్రయించనున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…