2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో ఇప్పటికే ఈ అరుదైన ఖగోళ ఘట్టంపై ఉత్కంఠ నెలకొంది. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని సాధారణంగా బ్లడ్ మూన్ గా పిలుస్తారు. ఈ సమయంలో భూమి సూర్యుడు-చంద్రుడి మధ్యకు వచ్చి చంద్రుడిపై నీడను వేసి, ఎర్రటి వర్ణంలో కనిపించేలా చేస్తుంది. ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణాలు సాధారణంగా సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లే సంభవిస్తాయి.
2026లో తొలి బ్లడ్ మూన్ చంద్రగ్రహణం మార్చి 2, 2026 న ఏర్పడనుంది. ఈ ఖగోళ ఘట్టం మధ్యాహ్నం 3:22 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది.
ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కనిపించనుంది. ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో ఇది స్పష్టంగా దర్శనమిస్తుంది. అస్సాం, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సంపూర్ణ గ్రహణం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా కోల్కతా, గువాహటి, ఐజ్వాల్, ఇటానగర్ వంటి నగరాల్లోనూ మంచి దృశ్యం కనువిందు చేయనుంది. ఇక బెంగళూరు, చెన్నై, ముంబయి, ఢిల్లీ, జైపూర్, లక్నో వంటి ప్రధాన నగరాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపించనుంది. భారతదేశంతో పాటు ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ ఈ బ్లడ్ మూన్ దర్శనమివ్వనుంది.
ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదు. కళ్లతోనే సురక్షితంగా చూడవచ్చు. సూర్యగ్రహణంలా ప్రత్యేక గ్లాసులు అవసరం ఉండవు. అయితే దూరదర్శిని లేదా బైనాక్యులర్స్ ఉంటే చంద్రుడి రంగు మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించడమంటే వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మేఘాలు, వర్షం, కాలుష్యం వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. అందుకే నగరాల వెలుపల, కాలుష్యం తక్కువగా ఉండే, ఆకాశం విస్తృతంగా కనిపించే ప్రదేశాన్ని ఎంచుకుంటే బ్లడ్ మూన్ను మరింత అద్భుతంగా ఆస్వాదించవచ్చు. ఖగోళ ప్రేమికులకు ఇది నిజంగా ఒక అరుదైన అవకాశం. మార్చి 2న ఆకాశాన్ని తిలకించేందుకు సిద్ధంగా ఉండండి.
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…