మనం పాటించే అనేక అలవాట్లకు సంబంధించి పెద్దలు అనేక నియమాలను చెబుతుంటారు. వాటిల్లో రాత్రి పూట గోళ్లను తీయవద్దనే నియమం ఒకటి. దీన్ని చిన్నప్పటి నుంచి చాలా మంది వినే ఉంటారు. ఎవరైనా రాత్రి పూట గోళ్లను తీస్తుంటే అలా చేయవద్దని పెద్దలు వారిస్తుంటారు. అయితే అసలు ఇలా చేయవద్దని చెప్పడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా ? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడంటే మనకు గోళ్లను కట్ చేసుకునేందుకు నెయిల్ కట్టర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వం అందుకు బ్లేడ్లను వాడేవారు. రాత్రుళ్లు అప్పట్లో కరెంటు ఉండేది కాదు. దీపాలను పెట్టుకునేవారు. కనుక రాత్రి పూట చీకటిగా ఉంటుంది కాబట్టి గోళ్లను తీస్తే బ్లేడ్తో వేళ్లకు గాట్లు పడేందుకు అవకాశం ఉంటుంది. కనుకనే రాత్రి పూట గోళ్లను తీయవద్దని చెప్పేవారు.
ఇక ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కనుక మంత్ర తంత్రాలను ఎవరూ నమ్మడం లేదు. కానీ పూర్వం వీటిని ప్రజలు ఎక్కువగా నమ్మేవారు. రాత్రుళ్లు మంత్రగాళ్లు తిరుగుతుంటారని, అలాంటి సమయంలో గోళ్లను తీస్తే వారు ఆ గోళ్లను తీసుకెళ్లి చేతబడి చేస్తారని నమ్మేవారు. అందువల్ల గోళ్లను రాత్రి పూట తీయవద్దని చెబుతారు.
ఇక దీని వెనుక ఉన్న ఇంకో కారణం ఏమిటంటే.. గోళ్లను జ్యోతిష్యం, వాస్తు ప్రకారం శల్య దోషం కింద భావిస్తారు. రాత్రి పూట గోళ్లను తీస్తే వాటిని సరిగ్గా పడేయకపోతే అవి మన ఇంటి చుట్టు పక్కల నేలలోనే ఉండిపోయేందుకు అవకాశం ఉంటుంది. దీంతో శల్య దోషం ఏర్పడుతుంది. అది మంచిది కాదు. కనుకనే రాత్రి పూట గోళ్లను తీయవద్దని చెప్పేవారు.
రాత్రి పూట అప్పట్లో కరెంటు ఉండేది కాదు కనుక గోళ్లను తీసి ఎక్కడంటే అక్కడ వేస్తే అవి కాళ్లలో గుచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి పూట లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుందట. అలాంటి సమయంలో వ్యర్థాలను తీయడం అంత మంచిది కాదట. ఆమెను అవమానించినట్లు అవుతుందట. అందుకనే ఈ కారణాల వల్లే రాత్రి పూట గోళ్లను తీయవద్దని పెద్దలు చెబుతుంటారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…