సాధారణంగా మనలో ఎవరూ కూడా ఇతరులు తింటున్న తిండిని షేర్ చేసుకుని తినేందుకు ఇష్టపడరు. అంతేకాదు ఒకరు వాడిన స్పూన్లు, ప్లేట్లలో కూడా మరొకరు తినరు. అయితే బయటి వ్యక్తులు వాడిన వాటి సంగతి పక్కన పెడితే మన స్నేహితులు, కుటుంబ సభ్యులు, దగ్గరి వారు ఒకరు తినేవి మరొకరు లాక్కుని తినడం (ఎంగిలి) సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో వారి ప్లేట్లను, స్పూన్లను ఇంకొకరు ఉపయోగిస్తుంటారు కూడా. అయితే ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇతరుల తిండిని తినడం, వారు తిండికి ఉపయోగించిన వస్తువులను వాడడం వంటివి చేస్తే వారి ఉమ్మిలో నుంచి బాక్టీరియా ఎదుటి వారి శరీరంలోకి వెళ్లేందుకు అవకాశం ఉంది. దీంతో ఇన్ఫెక్షన్లు వస్తాయి. అవలక్షణాలున్నవారు తినే ఆహారాన్ని, బాటిల్స్, స్పూన్స్ వంటి వస్తువులను ఇతరులు తీసుకుంటే ఆ అవలక్షణాలన్నీ ఎదుటి వారికి కూడా సంక్రమిస్తాయని విశ్వసిస్తారు. మెక్సికో వంటి దేశాల్లో ఒకరు తినే ఆహారాన్ని, అందుకోసం ఉపయోగించే వస్తువులను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం తప్పేమీ కాదు. ఇది వారిండ్లలో చిన్న పిల్లలు ఉంటేనే వర్తిస్తుంది. వారు పెరిగి పెద్దవారైతే ఒకరి వస్తువులను, ఆహారాన్ని మరొకరు తీసుకోకూడదని చెబుతారు. ఎందుకంటే ఇతరుల ఆహారాన్ని, వస్తువులను తీసుకుంటే ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నట్టు అవుతుందని అర్థం అట. కనుక అలా చేయరు.
కొత్తగా పెళ్లయిన వారికి, నూతన దంపతులకు వివాహ సందర్భంలో, లేదా వేరే ఎక్కడ డిన్నర్లోనైనా ఒకరి భోజనం మరొకరితో షేర్ చేసుకోమని, ఒకరికొకరు తినిపించుకోమని చెబుతారు. ఎందుకంటే వారి మధ్య బంధం మరింత బలపడాలని అంటారు. అయితే పెళ్లి కూతురు తిన్న ఎంగిలి ఆహారాన్ని ఎవరైనా తింటే వారికి త్వరగా పెళ్లవుతుందని కొంత మంది నమ్ముతారు. తిండి కోసం ఒకరు వాడిన వస్తువులను మరొకరు వాడడం అనారోగ్యకరమైన చర్యగా భావిస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఒకరు ఉపయోగించిన వాటిని మరొకరు వాడకూడదు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…