గర్భం దాల్చిన మహిళలను పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగమని పెద్దలు చెబుతుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. గర్భిణీలు అందుకనే రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒకటి లేదా రెండు కుంకుమ పువ్వు రెక్కలను కలిపి తాగుతుంటారు. అయితే కుంకుమ పువ్వును కలుపుకుని తాగడం వల్ల పుట్టబోయే పిల్లలు అందంగా పుడతారని ఒక నమ్మకం ఉంది. మరి సైన్స్ దీని గురించి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంకుమ పువ్వులో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల పాలలో కుంకుమ పువ్వును కలుపుకుని తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఆ మాట వాస్తవమే. గర్భిణీలు 9వ నెలలో కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగితే కండరాలు ప్రశాంతంగా మారుతాయి. దీంతో సుఖ ప్రసవం జరుగుతుంది.
కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. గర్భం దాల్చిన మహిళలకు సహజంగానే ఈ సమస్యలు వస్తాయి కనుక అలా తాగడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.
కుంకుమ పువ్వులో యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. గర్భిణీలు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. అయితే కుంకుమ పువ్వును అధిక మోతాదులో తీసుకుంటే హాని కలుగుతుంది. కనుక రోజుకు 1 లేదా 2 రెక్కల్ని మించకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగడం వల్ల పుట్టబోయే పిల్లలతోపాటు తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటారన్న మాట నిజం. సైన్స్ దీన్ని ధ్రువీకరించింది. కానీ పిల్లలు అందంగా పుడతారని ఎక్కడా నిరూపణ కాలేదు. అందువల్ల పిల్లల ఆరోగ్యం కోసం కుంకుమ పువ్వును అలా పాలలో కలిపి తీసుకోవచ్చు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…