గర్భం దాల్చిన మహిళలను పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగమని పెద్దలు చెబుతుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. గర్భిణీలు అందుకనే రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒకటి లేదా రెండు కుంకుమ పువ్వు రెక్కలను కలిపి తాగుతుంటారు. అయితే కుంకుమ పువ్వును కలుపుకుని తాగడం వల్ల పుట్టబోయే పిల్లలు అందంగా పుడతారని ఒక నమ్మకం ఉంది. మరి సైన్స్ దీని గురించి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంకుమ పువ్వులో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల పాలలో కుంకుమ పువ్వును కలుపుకుని తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఆ మాట వాస్తవమే. గర్భిణీలు 9వ నెలలో కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగితే కండరాలు ప్రశాంతంగా మారుతాయి. దీంతో సుఖ ప్రసవం జరుగుతుంది.
కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. గర్భం దాల్చిన మహిళలకు సహజంగానే ఈ సమస్యలు వస్తాయి కనుక అలా తాగడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.
కుంకుమ పువ్వులో యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. గర్భిణీలు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. అయితే కుంకుమ పువ్వును అధిక మోతాదులో తీసుకుంటే హాని కలుగుతుంది. కనుక రోజుకు 1 లేదా 2 రెక్కల్ని మించకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగడం వల్ల పుట్టబోయే పిల్లలతోపాటు తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటారన్న మాట నిజం. సైన్స్ దీన్ని ధ్రువీకరించింది. కానీ పిల్లలు అందంగా పుడతారని ఎక్కడా నిరూపణ కాలేదు. అందువల్ల పిల్లల ఆరోగ్యం కోసం కుంకుమ పువ్వును అలా పాలలో కలిపి తీసుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…