Birds On Electric Wires : కరెంటు అంటే తెలియని వారు ఉండరు. కరెంట్ తీగలు పట్టుకుంటే ఎంత ప్రమాదమో కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ఎప్పుడైనా గమనిస్తే బయట ఎన్నో పక్షులు కరెంటు తీగలపై కూర్చొని ఉంటాయి. మరి ఆ పక్షులకు కరెంట్ షాక్ ఎందుకు కొట్టదు.. పక్షులకు, మనుషులకు ఉన్న తేడా ఏమిటి..? కరెంటు షాక్ కొట్టకుండా వాటికి ఏమైనా ప్రత్యేక అమరిక ఉంటుందా..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా కరెంట్ లో ఫేజ్, న్యూట్రల్ అనేవి ఉంటాయి. వైర్స్ లో విద్యుత్ పాస్ కావాలంటే ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. ఇక రెండవది సర్క్యూట్. ఇందులోంచి కరెంటు పాస్ అవ్వాలంటే ఆ సర్క్యూట్ కంపల్సరిగా క్లోజ్ చేసి ఉండాలి. ఇక మూడవది రెసిస్టెన్స్. అంటే విద్యుత్ నిరోధకం. కరెంటు ఎప్పుడైనా సరే తక్కువ రెసిస్టెన్స్ ను ఉన్న దానిగుండా మాత్రమే ప్రవహిస్తుంది. ఇక పక్షుల విషయానికి వస్తే వాటికి షాక్ తగలక పోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది పక్షి తన రెండు కాళ్లను ఒకే తీగ పై పెట్టి నిలిచి ఉంటుంది.
అంటే సర్క్యూట్ క్లోస్ కాలేదు. దీనిలో కరెంట్ పాస్ కాదు. ఒకవేళ పక్షి పొరపాటున తన రెండో కాలుతో కానీ రెక్కతో కానీ పక్కనున్న మరో వైర్ ను తాకితే సర్క్యూట్ క్లోజ్ అయ్యి కరెంటు పక్షి గుండా పాస్ అవుతుంది. అప్పుడు పక్షికి కచ్చితంగా కరెంట్ షాక్ వస్తుంది. ఇక రెండవ కారణం రెసిస్టెన్స్. కరెంటు తీగ పై ఉన్న పక్షి రెసిస్టెన్స్, ఆ వైరు కు ఉన్న రెసిస్టెన్స్ తో పోల్చుకుంటే కచ్చితంగా పక్షి రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కరెంటు ఎప్పుడూ తక్కువ రెసిస్టెన్స్ ఉన్న దాని గుండానే ప్రవహిస్తుంది. తక్కువ రెసిస్టెన్స్ ఉండడం వల్ల వైర్ నుంచే కరెంటు పాస్ అవుతుంది. కానీ పక్షి నుంచి కరెంటు పాస్ అవదు. అందువల్లే పక్షులకు వైర్లపై కూర్చున్నా కరెంట్ షాక్ కొట్టదు. ఇదీ దాని వెనుక ఉన్న అసలు విషయాలు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…