పులస చేపల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీలో గోదావరి జిల్లాల్లో పులస బాగా లభిస్తుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందుకనే దీన్ని ఎంత ఖరీదుకు అయినా కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి అనే సామెత అందుకనే వచ్చింది.
పులస అత్యంత ఖరీదైన చేపగా ఉంది. వర్షాకాలం ప్రారంభంలో గోదావరిలో పులస చేపలు ఎక్కువగా లభిస్తాయి. అందుకనే వీటికి అంతటి ధర ఉంటుంది. ఇక ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో ఈ చేపలు కేజీకి రూ.5వేల నుంచి రూ.17వేల వరకు ధర పలుకుతున్నాయి. పులస వెరైటీని బట్టి ఆ ధర పలుకుతోంది. ఈ సీజన్లో ఆయా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మనకు పులస చేపలు బాగా కనిపిస్తాయి.
పులస చేపలను కొనుగోలు చేసేందుకు రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. కొందరు ఈ చేపలను ఇతరులకు బహుమతులుగా అందజేస్తుంటారు. కాగా మార్గెట్ వర్గాలు చెబుతున్న ప్రకారం.. ప్రతి రోజూ సుమారుగా 50కిలోల వరకు పులస చేపలు మార్కెట్కు వస్తుంటాయి. వాటిల్లో సుమారుగా 40కేజీల పులస చేపలను రోజూ అమ్ముతారు.
పులస చేపల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా అనేక మంది వస్తుంటారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు గోదావరి నదిలో పులస చేపలు లభిస్తాయి. ఈ చేపలతో పులుసు పెట్టి తింటే అదిరిపోయే రుచి వస్తుంది. అయితే చేపలను పులుసుగా వండాక ఒక రోజు ఆగి తింటే ఇంకా చక్కని రుచి వస్తుందని చెబుతారు.
పులస చేపలను ఈ సీజన్ లో చాలా మంది తింటుంటారు. అనేక రెస్టారెంట్లలోనూ దీని వంటలను వడ్డిస్తుంటారు. పులస గోదావరి నదిలో ఎదురు ఈదుతుందని, అందుకనే దీనికి అంత రుచి ఉంటుందని చెబుతారు. ఇక కొన్ని చోట్ల అయితే మార్కెట్కు రాకుండానే నది వద్దే వీటిని అక్కడికక్కడే కొనుక్కెళ్తుంటారు. పులసా.. మజాకా.. మరి..!
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…