Rs 10 Coin : ప్రస్తుతం సమాజంలో చాలా మంది పుకార్లనే నమ్ముతున్నారు. అవి అబద్ధమని తెలిసినప్పటికీ కొందరు పుకార్లనే నమ్ముతూ నష్టపోతున్నారు. ఇక అలాంటి వాటిలో ఒకటి రూ.10 కాయిన్ అని చెప్పవచ్చు. రూ.10 కాయిన్లను ఇప్పటికీ చాలా మంది తీసుకోవడం లేదు. అయితే అసలు ప్రజలలో ఈ నాణెం పట్ల ఇంతటి అపనమ్మకం నాటుకుపోవడానికి, వారు ఈ కాయిన్స్ను తీసుకోకపోవడానికి వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పట్లో.. అంటే రూ.10 కాయిన్లను ఆర్బీఐ పెద్ద ఎత్తున విడుదల చేసినప్పుడు ఈ నాణేనికి పెద్ద ఎత్తున నకిలీ కాయిన్లను తయారు చేసి మార్కెట్లోకి వదిలారు. దీంతో అసలు కాయిన్ కు, నకిలీ కాయిన్కు మధ్య తేడా కనుక్కోవడం కష్టమైంది. దీంతో రూ.10 నాణేలను తీసుకోవడమే మానేశారు. ఈ కాయిన్లను తీసుకునేందుకు నిరాకరించారు. దీని వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఇప్పటికీ ఇంకా ఈ కాయిన్లను తీసుకోవడం లేదు. కారణం.. అవి నకిలీ అయి ఉంటాయేమోనని. అందుకనే రూ.10 నాణేలను కొందరు తీసుకునేందుకు అంగీకరించడం లేదు.
ఇక ఆర్బీఐ రూ.10 నాణేలపై నిషేధం విధించిందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో సోషల్ మీడియా లేదు. నకిలీ వార్తలను గుర్తించేందుకు సరైన మాధ్యమం లేదు. దీంతో ఈ పుకారు బాగా వ్యాపించింది. అందుకనే చాలా మంది ఈ పుకారును నమ్మి రూ.10 నాణేలను తీసుకునేందుకు నిరాకరించడం మొదలు పెట్టారు. అది అలా అలా కొనసాగుతూ వస్తోంది.
ప్రధానంగా ఈ రెండు కారణాల వల్లే ఇప్పటికీ చాలా మంది రూ.10 నాణేలను తీసుకోవడం లేదు. అయితే ఈ విషయంలో ఆర్బీఐ ఎప్పుడో స్పష్టంగా ప్రకటన చేసింది. రూ.10 నాణేలు చెల్లుతాయని, ఎవరైనా తీసుకోకపోతే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని తేల్చి చెప్పింది. అయినప్పటికీ ఇప్పటికీ చాలా చోట్ల రూ.10 కాయిన్స్ ను చాలా మంది తీసుకోవడం లేదు. మరి ఈ పంథా భవిష్యత్తులో అయినా మారుతుందా, లేదా.. అన్నది చూడాలి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…