Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, సమంతలు హీరో హీరోయిన్లుగా ఖుషి అనే చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం విదితమే. శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో వచ్చిన పవన్ కల్యాణ్ ఖుషి టైటిల్తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో విజయ్, సమంత ఇద్దరి ఫస్ట్ లుక్ను ఇటీవలే విడుదల చేశారు. దీంతో ఆ ఫోటో వైరల్గా మారింది. అయితే తాజాగా ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సమంత, విజయ్ ఖుషి సినిమా షూటింగ్ ముగించుకుని వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు లోయలో పడిందని.. వారికి తీవ్ర గాయాలు అయ్యాయని.. దీంతో వారు హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారని.. వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు.
సమంత, విజయ్ దేవరకొండ కారులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు.. అన్న వార్తలపై ఖుషి దర్శకుడు శివ నిర్వాణ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. అదంతా ఫేక్ న్యూస్ అని.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విజయ్ ముంబైకి చేరుకోగా.. సమంత హైదరాబాద్కు వచ్చిందని.. కనుక ఆ వార్తల్లో నిజం లేదని.. వాటిని నమ్మకూడదని.. అన్నారు.
ఇక విజయ్ దేవరకొండ మరోవైపు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జేజీఎం (జనగణమణ) అనే చిత్ర షూటింగ్ కోసం ముంబైకి వెళ్లగా.. సమంత యథావిధిగా హైదరాబాద్కు వచ్చేసింది. ఈమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యశోద చిత్ర షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేయనున్నారు. అలాగే సమంత నటిస్తున్న శాకుంతలం అనే మూవీ కూడా ఈ ఏడాదే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…