Upasana : మెగా కోడలుగా పేరుగాంచిన ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు అటు పుట్టింటి నుంచి, ఇటు మెట్టింటి నుంచి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అపోలో హాస్పిటల్స్ నిర్వహణను చూసుకోవడమే కాదు.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఈమె చురుగ్గా పాల్గొంటున్నారు. మూగజీవాల పట్ల జాలి, దయ చూపిస్తుంటారు. జూ పార్క్లో ఇప్పటికే పలు జీవాలను దత్తత చేసుకుని వాటి పోషణ బాధ్యతలను చూస్తున్నారు. అలాగే 200కు పైగా అనాథ, వృద్ధాశ్రమాలకు ఆమె సహాయం చేస్తున్నారు. ఇలా ఉపాసన అత్తిల్లు, పుట్టిల్లు వారి పేరును నిలబెడుతున్నారు.
అయితే రామ్ చరణ్, ఉపాసన తాజాగా తమ 10వ పెళ్లి రోజును పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు వెకేషన్కు వెళ్లారు. అయితే ఓ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాను చిన్నప్పటి నుంచి ఎంతో స్వేచ్ఛగా పెరిగానని.. తనకు ఇంట్లో ఎంతో స్వేచ్ఛ ఉండేదని అన్నారు. ఈ సమాజంలో నమ్మకంగా ఎలా జీవించాలో తన తల్లిదండ్రులు తనకు నేర్పించారని.. అందువల్లే తన కాళ్లపై తాను నిలబడి జీవించగలుగుతున్నానని అన్నారు.
ఇక తన జీవితంపై తన తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఉపాసన తెలిపారు. అయినప్పటికీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆయన నుంచే నేర్చుకున్నానని వెల్లడించారు. ఇతరులను ప్రేమించడం, ఆప్యాయత చూపించడం వంటి అనేక విషయాలను తన తండ్రి ద్వారానే నేర్చుకున్నానని అన్నారు. అయితే తాను చరణ్ను పెళ్లి చేసుకున్నాక పరిస్థితులు మారిపోయాయని.. ఆరంభంలో చరణ్తో ఇబ్బందులు పడ్డానని.. కానీ ఆయనను పెళ్లి చేసుకోవడం తన అదృష్టం అని తెలిపారు. అలాగే అన్ని విషయాల్లోనూ అడ్జస్ట్ అయి జీవిస్తున్నానని ఉపాసన తెలిపారు. కాగా ఉపాసన చేసిన ఈ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…