Upasana : టాలీవుడ్లో హీరోల మధ్య ఎంత సాన్నిహిత్యం ఏర్పడిందో మనం చూస్తూనే ఉన్నాం. కుర్ర హీరోలతోపాటు సీనియర్ హీరోలు కూడా పలు సందర్భాలలో కలుస్తూ అభిమానులకి మంచి వినోదాన్ని పంచుతున్నారు. పలు ఈవెంట్స్లో వీరు సందడి చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ‘దుబాయ్ ఎక్స్పో 2020’లో భాగంగా దుబాయ్కి వెళ్లారు ఉపాసన, నమ్రత.
దుబాయ్లో వీరందరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోగా, ఆ తర్వాత నమ్రత, ఆమె సోదరి శిల్పా, మనీశ్ మల్హోత్ర తదితరులకు ఉపాసన ప్రత్యేకంగా విందు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. ‘‘ఇష్టమైన స్నేహితులతో రుచికరమైన భోజనం. నాకెంతో ఇష్టమైనవారితో దుబాయ్లో ఈ మధ్యాహ్నం సరదాగా గడిచింది. ఉపాసన.. అద్భుతమైన వంటకాలతో నీలా విందు ఎవ్వరూ ఇవ్వలేరు.
మనీశ్.. ఈ రోజు నిన్ను ఇక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుకలే త్వరలో హైదరాబాద్లో మనందరం కలిసి జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్’’ అని నమ్రత పోస్ట్ పెట్టింది. దీనికి స్పందించిన ఉపాసన.. ‘‘సమయం ఎంతో సరదాగా గడిచిపోయింది. అతి త్వరలోనే మనం మళ్లీ హైదరాబాద్లో ఇలాగే కలుసుకోవాలి’’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…