దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో హాస్పిటళ్లలో సదుపాయాలకు తీవ్ర కొరత ఏర్పడింది. హాస్పిటళ్లు అన్నీ కోవిడ్ బాధితులతో నిండిపోతున్నాయి. బెడ్లు, ఆక్సిజన్, మందులు, వైద్య సిబ్బందికి తీవ్ర కొరత ఏర్పడింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సదుపాయాలకు కొరత ఏర్పడింది. అయితే మెరుగైన చికిత్స కోసం ఏపీ నుంచి కొందరు కోవిడ్ బాధితులను కుటుంబ సభ్యులు తెలంగాణకు తీసుకువస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ఆంబులెన్స్లలో వస్తున్నారు. కానీ నగరంలోనూ సదుపాయాలకు కొరత ఏర్పడడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆంబులెన్స్లను రాష్ట్రంలోకి అనుమతించడం లేదు.
ఏపీ నుంచి ఆంబులెన్స్లలో వస్తున్న కోవిడ్ బాధితులను తెలంగాణ పోలీసులు తిప్పి పంపేస్తున్నారు. కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏపీ నుంచి వచ్చిన ఆంబులెన్స్లను వెనక్కి పంపేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి వారు వెళ్తున్నారు. అయితే హైదరాబాద్లోనూ బెడ్లకు కొరత ఏర్పడిందని, సదుపాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు.
కానీ తమకు బెడ్ దొరికే పరిస్థితి ఉందని, దయచేసి అనుమతించాలని కోవిడ్ బాధితుల తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు వేడుకుంటున్నారు. అయినప్పటికీ పోలీసులు వారిని తెలంగాణలోకి అనుమతించడం లేదు. దీంతో చేసేది లేక వారు వెను దిరుగుతున్నారు. ఇక తెలంగాణలో వైద్య సిబ్బంది కొరత ఏర్పడడంతో సీఎం కేసీఆర్ 50వేల మంది ఎంబీబీఎస్ డాక్టర్లను కాంట్రాక్టు ప్రాతిపదికన 2-3 నెలల కోసం నియమించుకోవాలని హెల్త్ ఆఫీసర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే పరిస్థితి రోజు రోజుకీ మరింత దయనీయంగా మారుతోంది.
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం యుఫోరియా గ్రాండ్ రిలీజ్ ప్రెస్మీట్లో నటి భూమిక చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని…
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. Central Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్…
భారత్లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్…
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…