Tammareddy Bharadwaja : తమ్మారెడ్డి భరద్వాజ ఒకప్పుడు నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఆయన సినిమాలు ఎంతో వైవిధ్యభరితంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆయన సినిమాలను తీయడం లేదు. కానీ సినిమా రంగానికి చెందిన విషయాలపై స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి సహా కొందరు హీరోలు, దర్శకులు గతంలో సీఎం జగన్ను కలిసి ఏపీలో థియేటర్లలో టిక్కెట్ల ధరలను పెంచాలని.. సినిమా రంగానికి చెందిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. అయితే దీనిపైనే తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పెద్దరికం తీసుకుని వారి సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తున్నారు. బాగానే ఉంది. కానీ ప్రస్తుతం థియేటర్ల విషయానికి వస్తే టిక్కెట్ల ధరలు తక్కువగా ఉంటేనే మంచిది. కరోనా కారణంగా ఓటీటీలు రావడంతో ప్రేక్షకులు వాటికి అలవాటు పడిపోయారు. అలాంటి స్థితిలో వారిని సామాన్యంగా థియేటర్లకు రప్పించడమే కష్టం. అలాంటిది టిక్కెట్ల ధరలను పెంచితే వారు ఎలా వస్తారు ? ఇది నష్టానికి దారి తీస్తుందని ముందే చెప్పాను. అలాగే జరిగింది.. అంటూ తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.
సినిమా టిక్కెట్ల ధరలు ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు చూడరని.. ఈ విషయంలో చిరంజీవి నిర్ణయం తప్పని అన్నారు. ఆయన అసలు జగన్ను కలవకుండా ఉండాల్సిందని అన్నారు. ఈవిధంగా ఇంకోసారి చేసి సినిమా ఇండస్ట్రీ పరువు తీయవద్దని అన్నారు. ఈ క్రమంలోనే తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
అయితే టిక్కెట్ల ధరలు అధికంగా ఉన్నా సరే కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, విక్రమ్ వంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. అందువల్ల సినిమాలో కథ బలంగా ఉంటే అప్పుడు టిక్కెట్ల ధరలను పెంచినా ప్రేక్షకులు చూస్తారు. కానీ సినిమా బాగా లేకపోతే అది ఎంత పెద్ద సినిమా అయినా సరే ప్రేక్షకులు తిరస్కరిస్తారు. ఈవిషయం ఆచార్య, రాధేశ్యామ్ చిత్రాల విషయాల్లో రుజువు అయింది. అయితే ఉన్నట్లుండి తమ్మారెడ్డి భరద్వాజ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే విషయం మాత్రం అంతుబట్టడం లేదు.
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…