Hyper Aadi : జబర్దస్త్ షోలో ఎంతో కాలంగా కమెడియన్గా కొనసాగిన కిరాక్ ఆర్పీ ఈ మధ్య మల్లెమాల సంస్థపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే. మల్లెమాల వారు నిర్వహించే జబర్దస్త్ షోలో ఎవరికీ మర్యాద ఉండదని.. అన్నింటా అవమానాలే జరుగుతుంటాయని.. అసలు వారు భోజనం కూడా సరిగ్గా పెట్టేవారు కాదని.. ఆర్పీ సంచలన ఆరోపణలు చేశాడు. తమను కేవలం నాగబాబు మాత్రమే ఆదుకున్నారని అన్నాడు. ఆయన వల్లే జబర్దస్త్లో ఎంతో మంది సహాయం పొందారని అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలకు హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్లు కౌంటర్ ఇచ్చారు. వారు ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు.
కిర్రాక్ ఆర్పీ మల్లెమాల శ్యామ్ ప్రసాద్పై చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవమని హైపర్ ఆది, రామ్ ప్రసాద్లు అన్నారు. వాస్తవానికి శ్యామ్ ప్రసాద్ అనేక మందికి సహాయం చేశారని అన్నారు. ఆయన రష్మికి ఇల్లు కోసం ష్యూరిటీ ఇచ్చారని.. అలాగే ఎంతో మందికి సహాయం చేశారని తెలిపారు. దొరబాబు ఒక కేస్లో చిక్కుకుంటే వేరే సంస్థలు పని ఇవ్వకపోతే మల్లెమాల వారు పని ఇచ్చారని అన్నారు.
సుడిగాలి సుధీర్కు జబర్దస్త్లో ఎలాంటి అవమానాలు జరగలేదని.. ఆది, రామ్ ప్రసాద్లు తెలియజేశారు. సుధీర్ కావాలనే తనకు, రష్మికి మధ్య లవ్ ట్రాక్ ఉండేలా స్కిట్లు చేసేవాడని.. అలాగే తనపై కావాలనే ఇతర టీమ్ లీడర్స్తో పంచ్లు వేయించుకునేవాడని.. అతనికి జబర్దస్త్లో రెమ్యునరేషన్ తక్కువగా ఉండేదని.. వేరే చానల్ వాళ్లు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామంటేనే అతను వెళ్లాడు కానీ అతనికి, మల్లెమాల వారికి ఎలాంటి విభేదాలు లేవని.. ఆది, రామ్ ప్రసాద్ లు తెలిపారు. ఆర్పీ కావాలనే మల్లెమాలపై దుష్ప్రచారం చేస్తున్నాడని అన్నారు. ఈ క్రమంలోనే ఆది, రామ్ ప్రసాద్లు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…